BPL: బీపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. 12 మంది ఆటగాళ్లపై అనుమానం..!
- బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) 11వ సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
- పలు మ్యాచ్లు ఫిక్సింగ్ అయినట్టు వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) యాంటీ కరెప్షన్ యూనిట్(ఏసీయూ) విచారణ
- లీగ్లో 8 మ్యాచ్ల్లో స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫిక్సింగ్ కలకలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కుదిపేసింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా.. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) చూస్తోంది. ప్రస్తుతం బీపీఎల్లో ఫిక్సింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న యాంటీ కరప్షన్ యూనిట్తో కలిసి పనిచేసే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని బీసీబీ తెలిపింది. కాగా.. ఈ లీగ్లో ప్రపంచంలోని పలువురు స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు.
Read Also: Cremation dispute: తండ్రి అంత్యక్రియలపై వివాదం.. మృతదేహం సగం కోసి ఇవ్వాలని కొడుకు డిమాండ్..
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఎనిమిది మ్యాచ్ల్లో ఫిక్సింగ్:
ప్రస్తుత బీపీఎల్ సీజన్లో ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బీసీబీ యొక్క యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) 8 మ్యాచ్లను పరిగణనలోకి తీసుకున్నట్లు వివిధ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ ఎనిమిది మ్యాచ్ల్లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. యాంటీ కరప్షన్ యూనిట్ 10 మంది ఆటగాళ్లను ప్రశ్నించింది. ఇందులో ఆరుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు అన్క్యాప్డ్ బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఫ్రాంచైజీలలో దర్బార్ రాజ్షాహి, ఢాకా క్యాపిటల్స్పై ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి. సిల్హెట్ స్ట్రైకర్స్, చిట్టగాంగ్ కింగ్స్పై కూడా కమిటీకి సందేహాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్ల్లో ఫిక్సింగ్ జరిగినట్లు అనుమానం
ఫార్చ్యూన్ బరిషాల్ vs రాజ్షాహి (జనవరి 6)
రంగపూర్ రైడర్స్ vs ఢాకా (7 జనవరి)
ఢాకా vs సిల్హెట్ (జనవరి 10)
రాజ్షాహి vs ఢాకా (జనవరి 12)
చిట్టగాంగ్ vs సిల్హెట్ (జనవరి 13)
బారిసల్ vs ఖుల్నా టైగర్స్ (జనవరి 22)
మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కథనాలపై బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ స్పందించారు. దోషులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీపీఎల్ లీగ్ సమగ్రతను కాపాడటానికి బీసీబీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!