BPL: బీపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. 12 మంది ఆటగాళ్లపై అనుమానం..!
- బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) 11వ సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
- పలు మ్యాచ్లు ఫిక్సింగ్ అయినట్టు వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) యాంటీ కరెప్షన్ యూనిట్(ఏసీయూ) విచారణ
- లీగ్లో 8 మ్యాచ్ల్లో స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు.
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫిక్సింగ్ కలకలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కుదిపేసింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా.. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) చూస్తోంది. ప్రస్తుతం బీపీఎల్లో ఫిక్సింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న యాంటీ కరప్షన్ యూనిట్తో కలిసి పనిచేసే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని బీసీబీ తెలిపింది. కాగా.. ఈ లీగ్లో ప్రపంచంలోని పలువురు స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు.
Read Also: Cremation dispute: తండ్రి అంత్యక్రియలపై వివాదం.. మృతదేహం సగం కోసి ఇవ్వాలని కొడుకు డిమాండ్..
Also Read
- Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ఎనిమిది మ్యాచ్ల్లో ఫిక్సింగ్:
ప్రస్తుత బీపీఎల్ సీజన్లో ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బీసీబీ యొక్క యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) 8 మ్యాచ్లను పరిగణనలోకి తీసుకున్నట్లు వివిధ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ ఎనిమిది మ్యాచ్ల్లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. యాంటీ కరప్షన్ యూనిట్ 10 మంది ఆటగాళ్లను ప్రశ్నించింది. ఇందులో ఆరుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు అన్క్యాప్డ్ బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఫ్రాంచైజీలలో దర్బార్ రాజ్షాహి, ఢాకా క్యాపిటల్స్పై ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి. సిల్హెట్ స్ట్రైకర్స్, చిట్టగాంగ్ కింగ్స్పై కూడా కమిటీకి సందేహాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్ల్లో ఫిక్సింగ్ జరిగినట్లు అనుమానం
ఫార్చ్యూన్ బరిషాల్ vs రాజ్షాహి (జనవరి 6)
రంగపూర్ రైడర్స్ vs ఢాకా (7 జనవరి)
ఢాకా vs సిల్హెట్ (జనవరి 10)
రాజ్షాహి vs ఢాకా (జనవరి 12)
చిట్టగాంగ్ vs సిల్హెట్ (జనవరి 13)
బారిసల్ vs ఖుల్నా టైగర్స్ (జనవరి 22)
మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కథనాలపై బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ స్పందించారు. దోషులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీపీఎల్ లీగ్ సమగ్రతను కాపాడటానికి బీసీబీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!