Germany floods: జర్మనీని ముంచెత్తిన భారీ వరదలు.. ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. దక్షిణ జర్మనీలోని బవేరియాలో ఈ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలు కారణంగా ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. అలాగే కార్లు కొట్టుకుపోయాయి. నివాస ప్రాంతాలు జలమయ్యాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. బవేరియా మరియు బాడెన్-వుర్టెంబెర్గ్లలో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. బాధితుల్లో ఒక మహిళ వరదల్లో కొట్టుకుపోయింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..

దక్షిణ జర్మనీలో కొన్ని రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. మూడు నదులు కలిపే చారిత్రక నగరమైన పస్సౌలో నీటి మట్టాలు ఇప్పుడు 10మీ (32 అడుగులు)కి చేరుకున్నాయి. అలాగే ఆస్ట్రియా మరియు హంగేరిలో కూడా డానుబే నదీమట్టాలు కూడా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నది 6.86 మీటర్లకు చేరుకుంది. మధ్యాహ్నం సమయంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే హంగేరీలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. నేషనల్ వాటర్ డైరెక్టరేట్కు చెందిన గాబ్రియెల్లా సిక్లోస్ హెచ్చరించారు. ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు.

ఇక రైన్ నదిలో రాకపోకలు బంద్ అయ్యాయి. కార్గో షిప్లు నదిలో నిలిచిపోయాయి. నీటి మట్టాలు తగ్గాకే యధావిధిగా రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!