Narsingi: తై బజార్ పేరిట గుటకాయ స్వాహా.. సర్కారు ఆదాయానికి గండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narsingi: తై బజార్ పేరిట భారీ అవినీతికి తెరలేపారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ లో కొంత మంది కౌన్సిలర్లు. నార్సింగ్ మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ప్రతి ఏడాది నిర్వహించవలసిన వేలంపాటను నిర్వహించకుండా నార్సింగ్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారు. దీంతో గత 4 ఏళ్లుగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రతి ఏడాది టెండర్ ప్రక్రియ చేపట్టడం ద్వారా 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో తై బజార్ వేలంపాట నిర్వహించకుండా కొందరు అవినీతికి పాల్పడడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఓ ఇద్దరు అధికారులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గత నాలుగేళ్లుగా తై బజార్ వేలం వేయకుండా ప్రైవేట్గా సంతలను నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.
Read Also: Kishan Reddy: సికింద్రాబాద్లో నీలిట్ సెంటర్.. వర్చువల్ గా ప్రారంభించిన కిషన్ రెడ్డి
Also Read
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై తక్షణమే కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తై బజార్ వేలం పాటను నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ బాధ్యులపై సమగ్ర విచారణ జరపకుండా చర్యలు తీసుకోకపోవడంపై నార్సింగ్ ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దానితోపాటు ట్రేడ్ లైసెన్సుల వ్యవహారంలో సైతం భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే మున్సిపాలిటీగా పేరుపొందిన నార్సింగ్ మున్సిపాలిటీలో కేవలం 600 ట్రేడ్ లైసెన్సులు మాత్రమే జారీ చేశారంటే నార్సింగ్ మున్సిపాలిటీకి ఆదాయం ఎంత కోల్పోతుందన్న విషయం జిల్లా ఉన్నతాధికారులు గమనించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పార్కులు, అక్రమంగా నిర్మించిన భవనాలపై సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, తక్కువగా చేసి పనులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని నార్సింగ్ మున్సిపాలిటీని అక్రమార్కుల బారి నుంచి కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ను ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!