Maruti Suzuki : కార్ల ధరలు మరింత తగ్గించిన మారుతీ సుజుకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని వాహనాల తయారీ కంపెనీలు తమ విక్రయ నివేదికలను వెల్లడించాయి. ఎప్పటిలాగానే మారుతీ సుజుకీ విక్రయాల్లో దూసుకుపోయింది. మారుతీ సుజుకీ నంబర్ వన్ గా నిలిచింది. మే నెలలో మొత్తం 1,44,002 కార్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. కార్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. ఆటో గేర్ షిఫ్ట్ (AGS) వాహనాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. ఈరోజు నుంచే ధర తగ్గింపు అమల్లోకి వచ్చిందని కంపెనీ తన ఎక్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. తె
Read more : Chandini Chowdary: ఏంటి చాందిని అలా కుదిరిందా.. లేదా సెట్ చేసుకున్నావా.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్..
Also Read
ఇప్పటికే తక్కువ ధరలకు కార్లు విక్రయిస్తున్న సంస్థగా మారుతీకి పేరుంది. అందుకే ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలు ఈ కార్లను కొంటుంటారు. కాగా.. మారుతీ తగ్గింపు ప్రకటించిన ఏజీఎస్ వేరియంట్ వాహనాల్లో ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ ఉన్నాయి. ఈ మోడళ్లు రూ.5 వేల తగ్గింపు ధరతో లభించనున్నాయి. కార్ల ధరల్ని తగ్గిస్తున్న కారణాన్ని మాత్రం మారుతీ వెల్లడించలేదు. అయితే ఏజీఎస్ వేరియంట్లను మరింత అందుబాటు ధరలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆటో గేర్ షిఫ్ట్ అనేది మారుతీ సుజుకీ 2014లో మొదటిసారి పరిచయం చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల ప్రయోజనాలను అందిస్తుంది. అవసరాన్ని బట్టి దానికదే గేర్ మారిపోతుంటుంది. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పట్టణాల్లో ఏజీఎస్ ఉంటే డ్రైవింగ్ మరింత సులభమవుతుంది. అంతేకాదు ఇంధన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ ప్రకటనతో విక్రయదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
-
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?