Maruti Suzuki : కార్ల ధరలు మరింత తగ్గించిన మారుతీ సుజుకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని వాహనాల తయారీ కంపెనీలు తమ విక్రయ నివేదికలను వెల్లడించాయి. ఎప్పటిలాగానే మారుతీ సుజుకీ విక్రయాల్లో దూసుకుపోయింది. మారుతీ సుజుకీ నంబర్ వన్ గా నిలిచింది. మే నెలలో మొత్తం 1,44,002 కార్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. కార్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. ఆటో గేర్ షిఫ్ట్ (AGS) వాహనాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. ఈరోజు నుంచే ధర తగ్గింపు అమల్లోకి వచ్చిందని కంపెనీ తన ఎక్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. తె
Read more : Chandini Chowdary: ఏంటి చాందిని అలా కుదిరిందా.. లేదా సెట్ చేసుకున్నావా.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్..
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ఇప్పటికే తక్కువ ధరలకు కార్లు విక్రయిస్తున్న సంస్థగా మారుతీకి పేరుంది. అందుకే ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలు ఈ కార్లను కొంటుంటారు. కాగా.. మారుతీ తగ్గింపు ప్రకటించిన ఏజీఎస్ వేరియంట్ వాహనాల్లో ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ ఉన్నాయి. ఈ మోడళ్లు రూ.5 వేల తగ్గింపు ధరతో లభించనున్నాయి. కార్ల ధరల్ని తగ్గిస్తున్న కారణాన్ని మాత్రం మారుతీ వెల్లడించలేదు. అయితే ఏజీఎస్ వేరియంట్లను మరింత అందుబాటు ధరలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆటో గేర్ షిఫ్ట్ అనేది మారుతీ సుజుకీ 2014లో మొదటిసారి పరిచయం చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల ప్రయోజనాలను అందిస్తుంది. అవసరాన్ని బట్టి దానికదే గేర్ మారిపోతుంటుంది. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పట్టణాల్లో ఏజీఎస్ ఉంటే డ్రైవింగ్ మరింత సులభమవుతుంది. అంతేకాదు ఇంధన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ ప్రకటనతో విక్రయదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!