జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కొడిమ్యాల మండల కేంద్రంలో ఆవుదుర్తి మమత(32) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిన స్థితిలో ఇంట్లో ఉన్న దూలానికి మృతదేహాం వేలాడుతోంది. ఇంటి చుట్టూ తాళాలు వేసి ఉన్నాయి. దుర్గంధం వెదజల్లడంతో పోలీసులకు సమాచారం అందించారు కాలనీవాసులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డోర్ ఓపెన్ చేశారు. 5 రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Nani: ది ప్యారడైజ్లోకి అడుగు పెట్టేది అప్పుడే!
మృతదేహాన్ని తరలించడానికి వీలు లేకుండా ఉండడంతో ఉన్నచోటనే పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని యువతి తరఫున బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేదా అత్తింటి వారు హత్య చేశారా అని స్థానికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.