NTV Telugu Site icon

Anna Rambabu: ఈ ఎన్నికల్లో మంచిని గ్రహించి ఓటేయాలి.. జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేయాలి

Anna Rambabu

Anna Rambabu

మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం మార్కాపురం మండలం కొండేపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. తాను రెండుసార్లు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచెనని, ఇప్పుడు జగనన్న ఆదేశాల మేరకు మార్కాపురంలో పోటీ చేస్తున్నానని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో తనను గెలిపించాలని, మీకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని అక్కడి ప్రజలను కోరారు. జగన్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు అందరికి అందాయన్నారు.

Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్

చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హమీలు ఇస్తున్నారని, ఎన్నికల తర్వాత వాటన్నింటిని మరిచిపోయి ప్రజలను మోసం చేస్తారని అన్నా రాంబాబు ఆరోపించారు. మళ్లీ ఎన్నికల వేళ వస్తున్నారని, ఆయన ఇచ్చే హామీలను ఏవీ నమ్మద్దొని, నమ్మి మోసపోవద్దని సూచించారు. జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అయితేనే మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, పిల్లల భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. అందరూ కూడా ఈ ఎన్నికల్లో మంచిని గ్రహించి ఓటేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అన్నా రాంబాబు కోరారు.

Prajwal Revanna case: బాధితుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన సిట్.. నెంబర్ ఇదే!

పేదలందరికి మంచి జరగాలంటే… జగన్‌ను మళ్లీ సీఏం చేయాలన్నారు. పేదల ముంగిట్లోకి వచ్చిన సంక్షేమం, అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ జగన్‌ రావాలన్నదే మన ఆకాంక్ష అన్నారు. ఓటు అనే ఆయుధంతో అవ్వాతాతలు రానున్న ఎన్నికల్లో జగనన్నను ఆశీర్వదించండని, రాష్టంలో పింఛన్‌దారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని తరిమి కొట్టాలని ఆయన అన్నారు. పింఛన్ దారుల పడుతున్న ఇబ్బందులపై ప్రజలందరూ ఆలోచన చేయాలని కోరారు. 2019 నుంచి జగన్‌ సర్కారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసిందని ఆయన చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయన్నారు.