Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Manipur Violence N Biren Singh Meets Amit Shah Day After All Party Meet Key Pointers

Manipur Violence: అఖిలపక్ష సమావేశం తర్వాత అమిత్ షాను కలిసిన మణిపూర్ సీఎం.. ఏం జరిగింది?

Published Date :June 25, 2023 , 9:16 pm
By Rakesh Reddy
Manipur Violence: అఖిలపక్ష సమావేశం తర్వాత అమిత్ షాను కలిసిన మణిపూర్ సీఎం.. ఏం జరిగింది?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manipur Violence: మణిపూర్ హింసాకాండపై అఖిలపక్ష సమావేశం ముగిసిన మరుసటి రోజు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతల మధ్య కీలక చర్చ జరిగింది. ఎన్ బీరెన్‌ను బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మెతకవైఖరితో వ్యవహరిస్తోంది. ఎన్ బీరెన్ సింగ్ ఈ ఉదయం ఇంఫాల్ నుంచి దేశ రాజధానికి చేరుకుని అమిత్ షాతో ఆయన నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మణిపూర్‌లో పరిస్థితిని, రాష్ట్రంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి తీసుకున్న చర్యలను ఆయన హోంమంత్రికి వివరించారు.

ఇద్దరు నేతల మధ్య ఏం జరిగింది?
మణిపూర్‌లో పరిస్థితిపై ఎన్ బీరెన్ సింగ్, హోంమంత్రి అమిత్ షా మధ్య చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఎన్ బీరెన్ సింగ్ ట్వీట్ చేస్తూ, ‘హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. నేను వారికి మణిపూర్ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మణిపూర్‌లో గత వారం రోజుల నుంచి హింసాత్మక ఘటనలు నిలిచిపోయాయి. జరుగుతున్న పరిణామాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిశితంగా పరిశీలిస్తున్నారు. జూన్ 13 నుండి జరిగిన హింసలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు లేవు.

Also Read

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?
  • Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
  • West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

ఎన్ బీరెన్ సింగ్ మాట్లాడుతూ, ‘మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. శాశ్వత శాంతిని సాధించే దిశగా మన పనిని పటిష్టం చేసుకోవాలని అమిత్ షా సూచించారు. శాంతి భద్రతల కోసం అన్ని వైపుల నుంచి సహకారం కోరారు.

Called on Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji in New Delhi today and briefed about the evolving situation on the ground in Manipur. Under Amit Shah Ji’s close supervision, the State and Central Govt have been able to control the violence to a great extent in the past… pic.twitter.com/Rz4qToLDni

— N.Biren Singh (@NBirenSingh) June 25, 2023

Read Also:Telangana : ఘోర ప్రమాదం..కారుని ఢీకొన్న లారీ.. నలుగురు మృతి..

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన
అమిత్ షా శనివారం 18 పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మణిపూర్ హింసాకాండపై పిలుపునిచ్చారు. హింసాత్మకమైన రాష్ట్రాన్ని అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శించాలని పలు ప్రతిపక్షాలు సూచించాయి. 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కొన్ని పార్టీలు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, బీజేపీ పాలిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి. ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం లేదని 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోదీకి ఐదు అంశాల మెమోరాండం అందజేస్తూ.. ప్రభుత్వంపై, పరిపాలనపై ఎవరికీ నమ్మకం లేదని ఎమ్మెల్యేలు అన్నారు.

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. మణిపూర్ నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోందన్నారు. జూన్ 13 నుంచి ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘటనల వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని అన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌ సమస్యను పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మణిపూర్ హింసాత్మక ఘటనలపై అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

Read Also:Virendra Sehwag : ఆదిపురుష్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్..

ఏయే పార్టీలు పాల్గొన్నాయి?
బీజేపీ, కాంగ్రెస్‌, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌, మిజో నేషనల్‌ ఫ్రంట్‌, బీజేడీ, ఏఐఏడీఎంకే, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌ సహా పలు పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.

మే 3 నుంచి లోయలో అగ్గి రాసుకుంది
రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వాలని మైతేయ్ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌కు నిరసనగా మే 3వ తేదీన కొండ ప్రాంతాలలో ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఇంతలో అలజడి చెలరేగింది. మైతేయి, నాగా, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • kukis
  • Manipur Clash
  • Manipur Violence
  • Meitei

తాజావార్తలు

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

  • Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..

  • West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions