Mandipalli Ramprasad Reddy: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇది స్వర్ణ యుగం…
- గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్యం
- టీడీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని గాడిలో పెట్టాం
- కడప నగరంలో 17 కొత్త బస్సుల ప్రారంభం
- ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీనిర్వీర్యమైందని.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు నెలలో ఆర్టీసీని గాడిలో పెట్టినట్లు రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిర్వీర్యం అయిన సంస్థలను గాడిలో పెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశమన్నారు. కడప నగరంలోని ఆర్టీసీ డిపోలో 17 నూతన బస్సులను రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. “పింఛన్లు, రేషన్ పేదలకు ఎంత అవసరమో ఆర్టీసీ ప్రయాణం కూడా అంత ఆవసరం. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణం కోసం 1400 బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి 400 బస్సులు సిద్ధంగా ఉన్నాయి.” అని తెలిపారు.
READ MORE: YS Jagan: ఏపీలో ముఠాల పాలన కనిపిస్తుంది..
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
మరో వెయ్యి బస్సులను తీసుకొస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “రాబోయే రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం జరుగుతుంది. రాబోయే ఐదు సంవత్సరాల్లో 3000 నుంచి 5000 బస్సులను గ్రామాలకు, పట్టణాల్లోకి పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి కావలసిన సంక్షేమ పథకాలను పూర్తిగా అందించేందుకు కృషి చేస్తాం. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీ రావడానికి కారణమైన మహిళలకు త్వరలో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.” అని చెప్పారు.
తాజావార్తలు
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!