Manda Jagannatham : మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి… సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
- మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
- నాగర్కర్నూల్ ఎంపీగా 4 సార్లు పనిచేసిన మందా జగన్నాథం
- హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manda Jagannatham : మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథం (73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన, మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి నాలుగు సార్లు ఎంపీగా ప్రజలకు సేవ చేశారు.
2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన జగన్నాథం, అదే స్థానం నుంచి మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన అనుభవాలను వినియోగించుకోవాలని నిర్ణయించి, 2018లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా న్యూఢిల్లీలో నియమించింది. ఈ పదవికి కేబినెట్ హోదా కూడా కేటాయించారు. పదవీకాలం ముగిసిన తరువాత మరోసారి అదే పదవిలో కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
ఆనారోగ్యం , కన్నుమూసిన ఘటన
గతేడాది డిసెంబర్ చివరిలో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ, నిమ్స్ ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో 2025 జనవరి 12న ఆయన కన్నుమూశారు.
వ్యక్తిగత జీవితం
మందా జగన్నాథం కుటుంబం విద్య, వైద్యంలో ప్రాధాన్యతనిచ్చినది. కుమార్తె మంద పల్లవి ఎంఎస్ పూర్తి చేసి ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు మంద శ్రీనాథ్ బీటెక్ పూర్తి చేసి సోషల్ వర్కర్గా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు మంద విశ్వనాథ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు.
జనసేవకుని మృతి పట్ల సంతాపం
మందా జగన్నాథం కన్నుమూయడం రాజకీయ, సామాజిక రంగాలకు తీరని లోటుగా చెప్పవచ్చు. రాజకీయ ప్రేరణతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన చూపించిన శ్రద్ధ ప్రత్యేకంగా గుర్తించదగినది. 73 ఏళ్ల వయసులో ఈ సేవకుడు తన జీవన యాత్ర ముగించడం పట్ల రాజకీయ నేతలు, అనుచరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాధం మృతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలియజేశారు.. నాగర్ కర్నూల్ లోకసభ సభ్యునిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారునిగా మందా జగన్నాధం పాత్ర తెలంగాణ రాష్ట్రంలో మరుపురానిదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జగన్నాధం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. అయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతి తెలియజేశారు.
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!