Manchu Vishnu: 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచువారబ్బాయి
- 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు.
- తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన ఆనాధలు.
- సిసిల మీడియాలో విష్ణుపై ప్రసంశలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ పిల్లలతో కలిసి భోగి మంటలు వేయడం, వారికి ఆట వస్తువులు, కొత్త బట్టలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. “120 మంది చిన్నారులకు విద్య, వైద్యంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటాను. ఈ పిల్లలు ఇక నుంచి నా కుటుంబసభ్యులే. పిల్లలతో సంక్రాంతి పండగను జరుపుకోవడం నాకు ఎంతో సంతోషం ఇస్తోంది. వారికి అవసరమైన అన్ని వసతుల్ని అందించేందుకు నేను ప్రయత్నిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, “కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. కానీ, నా మంచి పని ఇతరులకు కూడా ఆదర్శంగా మారాలని నేను ఆశిస్తున్నాను. మాతృశ్య సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి గొప్ప మనసుతో ఈ చిన్నారులను ఆదరిస్తున్నారు. ఇప్పటి నుంచి నేను ఈ సంస్థకు పెద్దన్నగా ఉంటాను” అని చెప్పుకొచ్చారు.
తాను ప్రారంభించిన ఈ మంచి పనిలో అందరి సహకారం కూడా అవసరమని ఆయన పిలుపునిచ్చారు. “అవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఇలాంటి మంచి పనులు చేస్తే సమాజానికి మేలు జరుగుతుంది. మీ ప్రాంతంలో ఉన్న అనాథ పిల్లల్ని ఆదరించి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేయండి” అని కోరారు. మంచు విష్ణు చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, సోషల్ మీడియాలో విష్ణుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచు విష్ణు చేసిన మంచి పని ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో మంచు విష్ణు తన శ్రేయస్సుతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..