Mamata Banerjee: రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించనున్న మమతా బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ఒడిశాలోని కటక్-భువనేశ్వర్లోని ఆసుపత్రులను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న ట్రిపుల్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉంది. సీఎం మమతాబెనర్జీతో పాటు రాష్ట్ర మంత్రులు చంద్రిమా భట్టాచార్య, శశి పంజాలతో కలిసి వెళ్లనున్నారు. భువనేశ్వర్ నుంచి తిరిగి వస్తూ పశ్చిమ మెదినిపూర్ జిల్లాలోని మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా కలిసే అవకాశం ఉందని రాష్ట్ర సచివాలయ తెలిపింది.
Also Read: Balasore Train Accident: బాలాసోర్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
రోగులను కలవడంతో పాటు, వారికి చికిత్స ఎలా అందిస్తున్నారో అనేది దానిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యవేక్షిస్తారు. గాయపడిన వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడబోతున్నారు. ఒడిశాలోని వివిధ ఆసుపత్రులలో కనీసం 206 మంది గాయపడిన వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా కటక్ మరియు భువనేశ్వర్లలో, ఒడిశాలోని వివిధ శవాగారాల్లో అనేక గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దాదాపు 60 మంది క్షతగాత్రులు మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జూన్ 2న జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్కు చెందిన 90 మంది మరణించగా, 73 మందిని తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.
Also Read: Rakul Preet Sing: రెడ్ బికినీలో రచ్చ చేస్తున్న రకుల్
ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం మరియు ప్రత్యేక హోంగార్డు ఉద్యోగాన్ని ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా, తక్కువ గాయపడిన వారికి రూ. 50,000, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రమాదంలో గాయపడని వారి కుటుంబానికి 2,000 రూపాయల ఎక్స్గ్రేషియా మరియు నాలుగు నెలల పాటు ఉచిత రేషన్ అందించడానికి కూడా ప్రకటించింది. ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారి బంధువులకు కూడా ప్రత్యేక హోంగార్డులుగా ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!