Mamata Banerjee: జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందే న్యాయవ్యవస్థకు సూచనలిచ్చిన మమతా బెనర్జీ..ఏమన్నారంటే?
- న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా.. నిజాయితీగా..స్వచ్ఛంగా ఉండాలని సూచన
- తాను కూడా న్యాయవాద సభ్యురాలినేనన్న పశ్చిమ బెంగాల్ సీఎం
- ఇప్పటికీ బార్ అసోసియేషన్లో సభ్యురాలినే అని స్పష్టం
- నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో ప్రసంగించిన మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో బెనర్జీ ప్రసంగిస్తూ.. “పశ్చిమ బెంగాల్లో 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. వాటిలో 55 మహిళలకు మాత్రమే. రాష్ట్రంలో 99 మానవ హక్కుల కోర్టులు ఉన్నాయి. దేశంలోని న్యాయవ్యవస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలన్నదే నా విజ్ఞప్తి. గోప్యత పాటించాలి.” అని పేర్కొన్నారు.
READ MORE: CM Revanth Reddy : వరంగల్ పర్యటనలో అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్. శివగణనం కూడా ఉన్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ముఖ్యమంత్రి.. తాను కూడా న్యాయవాద సభ్యురాలు అని, న్యాయ వ్యవస్థ తనకు పవిత్ర దేవాలయం, చర్చి, మసీదు లేదా గురుద్వారా లాంటిదని అన్నారు. “నేను చట్టపరమైన సోదరభావంలో భాగమని భావిస్తున్నాను. నేను ఇప్పటికీ బార్ అసోసియేషన్లో సభ్యురాలిని. నేను కూడా కోర్టులో కొన్ని కేసులు వాదించాను. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ న్యాయవ్యవస్థ వెంటే ఉంటుందని, సామాన్య ప్రజలను రక్షించడం న్యాయవ్యవస్థ ప్రథమ బాధ్యత. వ్యవస్థను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 1,000 కోట్లు ఖర్చు చేసింది. న్యాయవ్యవస్థ సామాన్యులకు రక్షణ కల్పించకపోతే వారిని ఎవరు కాపాడుతారు? న్యాయవ్యవస్థ మాత్రమే తమ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని సామాన్యులు విశ్వసిస్తారు. దేశ న్యాయవ్యవస్థను మెరుగుపరచడంలో జస్టిస్ చంద్రచూడ్ నిస్సందేహంగా సహాయపడ్డారు.” అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!