Maldives Tourism Rankings: మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్లో ఐదో స్థానానికి భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్యపరమైన వివాదం కారణంగా మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఐదో స్థానానికి పడిపోయింది. మాల్దీవులు పర్యాటక శాఖ విడుదల చేసిన తాజా డేటా వివరాల ప్రకారం.. డిసెంబర్ 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం ఐదో స్థానానికి దిగజారిపోయింది. 2024 జనవరి 28 నాటికి మాల్దీవులు టూరిజంతో భారత్ వాటా కేవలం 8 శాతం ఉండగా చైనా 9.5శాతం, యూకే 8.1శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం 13 వేల 989 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. ఈ ఏడాది జనవరి మాసంలో అత్యధిక మంది పర్యాటకులను మాల్దీవులకు పంపిన దేశాల్లో రష్యా (18,561), ఇటలీ (18,111), చైనా (16,529) , యూకే (14,588) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కేవలం ఒక నెలలోనే మాల్దీవుల టూరిజం మార్కెట్లో భారత్ యొక్క స్థానం గణనీయంగా పడిపోడం గమనార్హం. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి.
Read Also: Ajith Kumar: అక్కడ విడ ముయార్చి షూటింగ్ కంప్లీట్ అయ్యింది…
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇక, బీచ్లు, లగ్జరీ టూరిజానికి ప్రసిద్ధి చెందిన మాల్దీవులకు 2023లో అతి పెద్ద టూరిజం మార్కెట్గా భారతదేశం ఉండేది. 2020కి ముందు చైనా ఫస్ట్ స్థానంలో ఉండేది. కానీ, 2020 తర్వాత భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన పరిణామాల వల్ల మళ్లీ భారత్ ఐడో స్థానానికి పడిపోయింది. ఇటీవల మాల్దీవులు అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల నేతగా పరిగణించసడటంతో చైనీయులు మాల్దీవులు పర్యటనకు అత్యధికంగా వెళ్తున్నారు. తాజాగా ముయిజ్జూపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ రెడీ అయింది.
తాజావార్తలు
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!