India- Maldives conflict: భారత సైనికులను తరిమికొట్టేందుకే తనకు ఓటేశారు.. ఖాళీ కూర్చీల ముందు ముయిజ్జూ ప్రసంగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- Maldives Row: మాల్దీవులలో భారీ ప్రతిష్టంభన కొనసాగుతుంది. అయితే, భారత వ్యతిరేక వైఖరిని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ కొనసాగిస్తున్నారు. ఇవాళ మాల్దీవుల పార్లమెంటులో తన ప్రసంగం సందర్భంగా మరోసారి భారత్పై పలు వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులను తరిమికొట్టేందుకే మాల్దీవుల ప్రజలు తనకు ఓటు వేశారని అన్నారు. మాల్దీవుల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని అనుమతించమని భారత్పై విరుచుకుపడ్డారు. మే 10 నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెడతాయి.. దీనికి భారతదేశం- మాల్దీవులు అంగీకరించినట్లు ఆయన చెప్పారు.
Read Also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ.. 16కు వాయిదా
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అయితే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ పార్లమెంట్లో ఖాళీ కూర్చిలకు తన ప్రసంగం వినిపించాడు. ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరి కారణంగా విపక్షాలు తన ప్రసంగాన్ని బహిష్కరించాయి. ముయిజ్జూ ప్రసంగానికి ముందే మాల్దీవుల్లోని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ- డెమొక్రాట్స్ పార్టీలు పార్లమెంట్ కు వచ్చేందేకు నిరాకరించాయి. అధ్యక్షుడు మాల్దీవుల పార్లమెంటుకు చేరుకునే సరికి దాదాపు చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముయిజ్జూ ప్రసంగిస్తున్నప్పుడు కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే సభలో ఉన్నారు.
Read Also: Viral Video : ఏందీ భయ్యా ఇది.. అమ్మాయిలు ఇలా తయారయ్యారేంటి..
ఇక, 87 స్థానాలున్న మాల్దీవుల పార్లమెంటులో మొత్తం 56 మంది ఎంపీలు ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించారు. వీరిలో డెమోక్రాట్ల నుంచి 13 మంది, ఎమ్డీపీకి చెందిన 43 మంది ఎంపీలు ఉన్నారు. ఇవాళ ఉదయం 9:00 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మాల్దీవుల పార్లమెంటు చరిత్రలో ఇదే అతిపెద్ద బహిష్కరణ అని స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి. MDP- డెమొక్రాట్లు కూడా అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!