Maldives: అభిశంసనకు సిద్ధమవుతున్న విపక్షాలు.. సుప్రీంకు ముయిజ్జు ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ అధికారాన్ని కోల్పోతారనే భయంతో ఉన్నారు. ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్ష ఎంపీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అభిశంసన ప్రక్రియకు సంబంధించి పార్లమెంటు విధివిధానాల్లో మార్పుల కోసం ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటార్నీ జనరల్ అహ్మద్ ఉషమ్ మంగళవారం నాడు సుప్రీంకోర్టులో రాజ్యాంగపరమైన కేసు దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించిన తదుపరి సమాచారం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.
Read Also: Chhattisgarh: మావోయిస్టుల కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి, 14 మందికి గాయాలు
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం, మొత్తం ఎంపీల సంఖ్యలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను పదవి నుండి తొలగించవచ్చు. అంటే, పీపుల్స్ మజ్లిస్ (మాల్దీవుల పార్లమెంటు)లో ప్రస్తుత సెషన్లో 87 మంది ఎంపీలలో 58 మంది కోరుకుంటే, వారు ముయిజ్జును ప్రభుత్వం నుంచి తొలగించవచ్చు. సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) మహ్మద్ ముయిజ్జుపై అభిశంసనను తీసుకురావాలని కోరుతోంది. ప్రస్తుతం పార్లమెంటులో ఎండీపీ మెజారిటీలో ఉంది.
Read Also: Delhi: బడ్జెట్ సెషన్పై ఆల్పార్టీ మీటింగ్.. ఏం చర్చించారంటే..!
ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ ఎండీపీ నియంత్రణలో ఉంది. మంత్రులు కావడానికి 7 మంది సభ్యులు సభకు రాజీనామా చేశారు. ఆ తర్వాత మొత్తం ఎంపీల సంఖ్య 87 నుంచి 80కి తగ్గింది. అభిశంసన నియమాలను ఎండీపీ మార్చింది. అంతకుముందు, అభిశంసన కోసం మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల ఓట్లు అవసరం. కానీ కొత్త నిబంధన ప్రకారం పార్లమెంటులో ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా మూడింట రెండు వంతుల ఓట్లను లెక్కించనున్నారు. అటువంటి పరిస్థితిలో 54 మంది ఎంపీలు అధ్యక్షుడిని తొలగించవచ్చు.
ఎండీపీకి అధ్యక్షుడిని తొలగించగల 54 మంది ఎంపీలు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ కారణంగా ముయిజ్జు ప్రభుత్వం భయపడుతోంది. ప్రస్తుతం ఎండీపీకి 44 మంది ఎంపీలు ఉన్నారు. కాగా డెమోక్రాట్లకు 13 మంది ఎంపీలు ఉన్నారు. రెండు పార్టీలకు కలిపి 57 మంది ఎంపీలు ఉన్నారు. నివేదికల ప్రకారం, అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడానికి ఎండీపీ తగినంత సంతకాలను పొందింది. ప్రతిపాదన తీసుకురావాలంటే 26 మంది ఎంపీల సంతకాలు అవసరం.
తాజావార్తలు
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!