Maldives: అభిశంసనకు సిద్ధమవుతున్న విపక్షాలు.. సుప్రీంకు ముయిజ్జు ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ అధికారాన్ని కోల్పోతారనే భయంతో ఉన్నారు. ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్ష ఎంపీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అభిశంసన ప్రక్రియకు సంబంధించి పార్లమెంటు విధివిధానాల్లో మార్పుల కోసం ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటార్నీ జనరల్ అహ్మద్ ఉషమ్ మంగళవారం నాడు సుప్రీంకోర్టులో రాజ్యాంగపరమైన కేసు దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించిన తదుపరి సమాచారం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.
Read Also: Chhattisgarh: మావోయిస్టుల కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి, 14 మందికి గాయాలు
Also Read
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం, మొత్తం ఎంపీల సంఖ్యలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను పదవి నుండి తొలగించవచ్చు. అంటే, పీపుల్స్ మజ్లిస్ (మాల్దీవుల పార్లమెంటు)లో ప్రస్తుత సెషన్లో 87 మంది ఎంపీలలో 58 మంది కోరుకుంటే, వారు ముయిజ్జును ప్రభుత్వం నుంచి తొలగించవచ్చు. సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) మహ్మద్ ముయిజ్జుపై అభిశంసనను తీసుకురావాలని కోరుతోంది. ప్రస్తుతం పార్లమెంటులో ఎండీపీ మెజారిటీలో ఉంది.
Read Also: Delhi: బడ్జెట్ సెషన్పై ఆల్పార్టీ మీటింగ్.. ఏం చర్చించారంటే..!
ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ ఎండీపీ నియంత్రణలో ఉంది. మంత్రులు కావడానికి 7 మంది సభ్యులు సభకు రాజీనామా చేశారు. ఆ తర్వాత మొత్తం ఎంపీల సంఖ్య 87 నుంచి 80కి తగ్గింది. అభిశంసన నియమాలను ఎండీపీ మార్చింది. అంతకుముందు, అభిశంసన కోసం మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల ఓట్లు అవసరం. కానీ కొత్త నిబంధన ప్రకారం పార్లమెంటులో ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా మూడింట రెండు వంతుల ఓట్లను లెక్కించనున్నారు. అటువంటి పరిస్థితిలో 54 మంది ఎంపీలు అధ్యక్షుడిని తొలగించవచ్చు.
ఎండీపీకి అధ్యక్షుడిని తొలగించగల 54 మంది ఎంపీలు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ కారణంగా ముయిజ్జు ప్రభుత్వం భయపడుతోంది. ప్రస్తుతం ఎండీపీకి 44 మంది ఎంపీలు ఉన్నారు. కాగా డెమోక్రాట్లకు 13 మంది ఎంపీలు ఉన్నారు. రెండు పార్టీలకు కలిపి 57 మంది ఎంపీలు ఉన్నారు. నివేదికల ప్రకారం, అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడానికి ఎండీపీ తగినంత సంతకాలను పొందింది. ప్రతిపాదన తీసుకురావాలంటే 26 మంది ఎంపీల సంతకాలు అవసరం.
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!