Cuttack Hospital Fire Accident: ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఉన్న SCB మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి ట్రామా కేర్ ఐసీయూలో చెలరేగిన ఈ మంటల్లో 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. అందిన సమాచారం ప్రకారం ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే అక్కడ పొగ దట్టంగా వ్యాపించడంతో రోగులను బయటకు తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చాలామందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినా, కొందరిని మాత్రం కాపాడలేకపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన పలు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాయి. అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తెచ్చేందుకు గంటల పాటు ప్రయత్నాలు కొనసాగించాల్సి వచ్చింది. రోగులను బయటకు తరలించే సమయంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది కాలిన గాయాలకు గురైనట్టు అధికారులు తెలిపారు. వారికి వెంటనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం.
SaiPallavi: భన్సాలీ కన్ను సాయిపల్లవిపైనే.. ఆ లెజెండరీ బయోపిక్ సెట్ అయినట్లేనా!
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరైనా నిర్లక్ష్యం చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన కటక్ చేరుకుని ఆసుపత్రిని సందర్శించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలాన్ని భద్రతా వలయంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై కూడా సమీక్ష చేస్తున్నారు అధికారులు.
#WATCH | Odisha: A fire broke out at Trauma Care ICU of S.C.B. Medical College and Hospital in Cuttack. Fire brigade present at the spot for firefighting operations. Visuals from the spot. More details awaited. pic.twitter.com/KZVF5wOy4V
— ANI (@ANI) March 16, 2026
