సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ సినిమా వారణాసి. హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్లోని కోకాపేట మరియు అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో నిరంతరాయంగా జరుగుతోంది.ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు- ప్రియాంక చోప్రాపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
Also Read : RAPO : బాహుబలి నిర్మాతలతో రామ్ పోతినేని సినిమా క్యాన్సిల్
హైదరాబాద్లో జరుగుతున్న ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే, చిత్ర బృందం విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈ నెల ఆఖరున మూవీ టీమ్ జార్జియా వెళ్లనుంది. అక్కడ సుమారు 15 రోజుల పాటు ఒక కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. జార్జియాలో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు భారీ యక్ష్ణ ఎపిసోడ్ ను కూడా అక్కడ షూట్ చేయనున్నారు. జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత చిత్ర యూనిట్ మళ్ళీ హైదరాబాద్ చేరుకోనుంది. ఇక్కడ తర్వాతి షెడ్యూల్ను ప్రారంభించనున్నారు. రాజమౌళి మార్క్ మేకింగ్తో, హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్ను కూడా పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్లోబల్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.