New Law: లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా కొత్త చట్టం?

  • పెరిగుతున్న లవ్ జీహాద్ కేసులు
  • మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • కొత్త చట్టం రూకల్పన?
  • అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
Love Jihad

Love Jihad

మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఉన్నారు.

READ MORE: Film Industry : రెమ్యునరేషన్స్ ఎఫెక్ట్.. జూన్ 1 నుంచి షూటింగ్స్ బంద్..

ప్రభుత్వ తీర్మానం ప్రకారం.. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. ‘లవ్ జిహాద్’, బలవంతపు మతమార్పిడి ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో చేసిన చట్టపరమైన అంశాలు, చట్టాలను కూడా పరిశీలిస్తుంది. ఈ ఘటనలను నిరోధించడానికి చట్టాలను రూపొందించాల్సిన చట్టాలను ఈ కమిటీ తెలియజేస్తుంది. పాలక మహాయుతి గత సంవత్సరం కూడా ‘లవ్ జిహాద్’ అంశాన్ని లేవనెత్తింది.

READ MORE: RRB GroupD Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్‌డి జాబ్స్.. కొన్ని రోజులే ఛాన్స్.. అప్లై చేశారా?

ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి మంగళ్ లోధా మాట్లాడారు. “దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ సంఘటనలు పెరిగాయి. శ్రద్ధా వాకర్‌ను ఎలా ముక్కలు చేశారో మనం చూశాం. మహారాష్ట్రలో ఇలాంటి కేసులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. లవ్ జిహాద్‌ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. అమ్మాయిలకు న్యాయం జరగాలి. ఒక కమిటీ ఏర్పడటం మంచిది. నివేదిక కూడా త్వరలో వస్తుంది. ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.” అని మంత్రి వ్యాఖ్యానించారు.