Farmers Crop Insurance : లక్షల విలువైన పంట నష్టపోతే రెండురూపాయల పరిహారం ఇచ్చిండ్రు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Crop Insurance : అన్నం పెట్టే రైతంటే అందరికీ చులకనే.. రైతు పదివేళ్లు భూమిలోకి వెళ్తేనే మన ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయన్న నిజాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆరుగాలం కష్టపడి మన కంచంలోకి అన్నం తెస్తున్న అన్నదాతను ఇటు ప్రభుత్వాలు.. అటు ప్రకృతి మోసం చేస్తూనే ఉన్నాయి. అవే కాకుండా పంట నష్టపోతే ఆదుకుంటాయనుకున్న బీమా కంపెనీలు సైతం అన్నదాతకు సున్నం పెడుతున్నాయి. మహారాష్ట్రలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ రైతు ఏడు ఎకరాల్లో పంట నష్ట పోతే అతడికి బీమా కంపెనీలు చెల్లించిన పరిహారం ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.76. పర్బణి జిల్లా దశాల గ్రామంలో ఓ రైతు రెండు ఎకరాల్లో సోయా, కంది, శనగ పంటలను సాగు చేశాడు. ఇందుకు ఆ రైతు రూ.25,000 పెట్టుబడి పెట్టాడు. ఈ సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అతడు నష్ట పరిహారం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. బీమా సంస్థ రైతుకు పరిహారంగా 1.76 రూపాయిలు చేతిలో పెట్టింది. ఇదే మాదిరి మరో రైతుకు రూ.14.21, మరో రైతుకు రూ.37.31 చొప్పున పంట నష్ట పరిహారం కింద బీమా కంపెనీలు చెల్లించడం చూస్తే అది తెలిసిన వాళ్లు అవాక్కవుతున్నారు.
Read Also: Viral News: రెండు నెలలకే పాటపాడేస్తున్న చిన్నారి.. ఆశ్చర్యంలో నెటిజన్స్
Also Read
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
రెండు ఎకరాల పంట సాగు నిమిత్తం ఓ రైతు బీమా ప్రీమియం రూపంలో రూ.455 చెల్లించాడు. మరో రూ.200ను పంట నష్టం మదింపు చార్జీల కింద చెల్లించాడు. మొత్తం రూ.655 కట్టిన రైతు, రూ.27వేల వరకు పరిహారం వస్తుందని ఆశించాడు.. కానీ వచ్చిన రెండురూపాయలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇక మూడు ఎకరాల్లో మరో రైతు నాలుగు రకాల పంటలను వేయగా, వర్షాల వల్ల కలిగిన నష్టానికి పీఎం ఫసల్ బీమా యోజన కింద పరిహారం కోరాడు. ఒక పంట నష్టానికి రూ.14.21 వచ్చింది. మరో పంట నష్టానికి రూ.1,200 దక్కింది. మిగిలిన రెండు పంటల నష్టాలకు రూపాయి కూడా రాలేదు. కానీ, రైతు చెల్లించిన మొత్తం ప్రీమియం రూ.1,800. దీంతో పంట బీమా పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..