Maharashtra: ఎన్నికల వేళ ఏక్నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి మారాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళలకు పెద్ద పీటవేస్తూ సోమవారం మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డ్లు వంటి అన్ని ప్రభుత్వ పత్రాలపై తల్లి పేరు తప్పనిసరిగా ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మే 1, 2024 నుంచే అమలులోకి వస్తుందని తీర్మానించింది.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వంట గ్యాస్ ధరను రూ.100లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం బిల్లును అమల్లోకి తెచ్చింది. ఇలా ఆయా వర్గాలను మచ్చిక చేసుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇటీవల మహారాష్ట్ర సర్కార్.. ఎప్పుట్నుంచో పెండింగ్లో ఉన్న మరాఠా బిల్లును ప్రత్యేక శాసనసభ నిర్వహించి ఆమోదించింది. ఈ బిల్లుతో మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. తాజాగా నారీమణులకు పెద్ద పీట వేస్తూ అన్ని ప్రభుత్వ పత్రాల్లో పేరు ఉండేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ వారంలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. పైగా సోమవారం సీఏఏ బిల్లును కేంద్రం ఆమోదించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నోటిఫికేషన్కు కౌంట్డౌన్ మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Maharashtra cabinet has decided that the name of the mother will be mandatory on all govt documents like Birth certificates, School documents, property documents, Aadhar cards, and PAN cards. The decision is to be implemented from 1st May 2024.
— ANI (@ANI) March 11, 2024
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!