Kidney Racket: కిడ్నీ రాకెట్ వ్యవహారం.. గ్లోబల్ ఆస్పత్రి సీజ్, పలువురి అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం రేపింది. మానవ అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో ఒక మహిళ మృతి చెందడం, పలువురు వైద్యులు, ముఠా సభ్యులు అరెస్టు కావడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళలను పద్మ అనే మహిళ మదనపల్లికి తీసుకొచ్చింది. వీరిపై గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ తొలగించే శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఆ ఆపరేషన్లో యమున అనే మహిళ పరిస్థితి విషమించి మరణించింది. దీనితో యమున కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మదనపల్లి టూటౌన్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాంతో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Sandeep Chakravarthi: సెల్యూట్..! ఉగ్రకుట్ర భగ్నం కేసులో ఈ తెలుగు అధికారి పాత్ర కీలకం..
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
పోలీసులు దర్యాప్తు చేపట్టి.. కిడ్నీ రాకెట్ ముఠాలో కీలక నిందితుడిగా నీరజ్ అనే వ్యక్తిని గుర్తించారు. అంతేకాకుండా ఈ ముఠాతో కలిసి పనిచేస్తున్న గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ రాకెట్కు సహకరిస్తున్న పద్మ అనే మహిళ ప్రస్తుతం పరారీలో ఉండగా.. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ రాకెట్ బహిర్గతం కావడంతో మదనపల్లిలోని గ్లోబల్ హాస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో హాస్పిటల్ యజమాని డా. ఆంజనేయులు, మరో వైద్యుడు, అలాగే విశాఖకు చెందిన పెళ్లి పద్మ, కాకర్ల సత్య లపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు.
Investments in Amaravati: రూ.50,000 కోట్ల లక్ష్యం.. పలు రంగాల్లో భారీ పెట్టుబడులు..!
ముఠా సభ్యుల మధ్య డబ్బు పంచుకునే విషయంలో తిరుపతిలో గొడవలు తలెత్తడంతో విషయం బయటపడింది. ఒకరికొకరు ఘర్షణకు దిగడంతో పోలీసుల దృష్టికి ఈ వ్యవహారం వచ్చింది. దీని ఫలితంగా మొత్తం కిడ్నీ రాకెట్ నెట్వర్క్ బి బయట అయ్యింది. అంతేకాకుండా పోలీసులు ల్యాబ్ టెక్నీషియన్లపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..