Site icon NTV Telugu

Kareena Kapoor : నటి కరీనా కపూర్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసు జారీ.. కారణం అదేనా..?

Whatsapp Image 2024 05 11 At 12.59.23 Pm

Whatsapp Image 2024 05 11 At 12.59.23 Pm

బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నటి “కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్” అనే పుస్తకం రాసింది.అయితే ఈ పుస్తకం టైటిల్ లో “బైబిల్”అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ కోర్టును ఆశ్రయించడంతో నటి కరీనాకు నోటీసు జారీ చేయబడింది.ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగల్ జడ్జి బెంచ్ ఆమెకు నోటీసు జారీచేసింది. కరీనా కపూర్‌పై కేసు నమోదు చేయాలని అడ్వకేట్ క్రిస్టోఫర్ ఆంథోనీ పిటీషన్ వేశారు.

పుస్తకం టైటిల్‌లో బైబిల్ అన్న పదాన్నివాడటానికి గల కారణం ఏమిటని కోర్టు ప్రశ్నలు వేసింది.ఈ పుస్తకంపై బ్యాన్ విధించాలని అడ్వకేట్ ఆంధోనీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పుస్తక విక్రయదారులపై కూడా కేసు నమోదు చేయాలంటూ క్రిస్టోఫర్ ఆంథోనీ పిటీషన్ పై హైకోర్టు నోటీసు జారీచేసింది.పుస్తకం టైటిల్‌లో బైబిల్ అనే పదం వాడడం క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్‌లో ఆరోపించారు. క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం సరికాదు అని ఆయన పిటీషన్‌లో పేర్కొన్నారు.

Exit mobile version