Madhu Goud Yaski: నారాయణ కాలేజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం వెనువెంటనే తీవ్ర చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులతో సహా హత్యనేరం కేసులు నమోదు చేయాలి. నారాయణ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలి.ఇది కల్వకుంట్ల కుటుంబ స్కామ్. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యాసంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదన్నారు మధు యాష్కీ.
నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా అభివర్ణిస్తున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పరేట్ కాలేజీలు దోచుకుంటున్నాయని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మండల కేంద్రాల్లోకి సైతం నారాయణ చైతన్య కాలేజీలు విస్తరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో సైతం ఇవి లేవు. మండల కేంద్రాలకు సైతం నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వచ్చి.. ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు… తగిన చర్యలు తీసుకోలేదు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
నారాయణ సంస్థల్లో మంత్రి హరీష్ రావు, బిడ్డ కవితలకు భాగస్వామ్యం ఉండడం వల్లే చర్యలు తీసుకోవడం లేదనే వార్తలు వస్తున్నయి. వీరి అండదండలు ఉండడం వల్లే ఈ కాలేజీలే ఇలే పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఈ ఘటన తరువాత కూడా చర్యలు తీసుకోకపోతే హరీష్ రావు, కవితలకు భాగస్వామ్యం ఉన్నట్లు నిరూపితం అవుతుంది. ఈఘటనకు మొత్తం బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు మధుయాష్కీ. నారాయణ, చైతన్య కాలేజీలు టీవీలు,పేపర్లలో ప్రకటనల కోసమే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయంటే.. ఎన్ని వేల కోట్ల రూపాయలను ప్రజలనుంచి పీడిస్తున్నారో అర్థం అవుతోంది. గాయపడ్డ విద్యార్థులకు నారాయణ యాజమాన్యం మెరుగైన చికిత్సను అందించాలి. తెలంగాణలోని ప్రవేట్ టీచర్లు అంతా మేల్కోవాలన్నారు మధు యాష్కీ.
Read Also: Soldier Killed: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!