Soldier Killed: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soldier Killed In Militant Attack Near Bangladesh Border: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి జరిగింది. త్రిపురలోని భారత్- బంగ్లా సరిహద్దులో ఈ మిలిటెంట్లకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. ఉత్తర త్రిపురలోని కంచన్ పూర్ సబ్ డివిజన్ పరిధిలోని అనందబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం త్రిపుర-మిజోరాం- బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ సమీపంలో ఎన్ఎల్ఎఫ్టీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
145 బీఎస్ఎఫ్ బెటారియన్ పెట్రోలింగ్ బృందంపై ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు విచక్షణారిహితంగా బీఎస్ఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారు. తేరుకుని బీఎస్ఎఫ్ దళాలు ఎదురుకాల్పులకు దిగే లోపే.. ఉగ్రవాదులంతా అడవిల్లోకి పారిపోయారని.. బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోంది. తీవ్రగాయాల పాలైన గిర్జేష్ కే ఆర్ ఉద్దేని హెలికాప్టర్ లో అగర్తలాకు తరలించారు. అక్కడ ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సరిహద్దుకు అవతలి వైపు నుంచి వచ్చిన ఉగ్రవాదులు సైనికుడిపై కాల్పులు జరిపారు. గతేడాది త్రిపురలోని భారత్-బంగ్లా సరిహద్దుల్లో కూడా ఇలాంటి దాడే జరిగింది. ఎన్ఎల్ఎఫ్టీ ఉగ్రవాదులు పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది మరణించారు.
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
Read Also: Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతుందో తెలుసా?
అయితే ఉగ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ఈ దాడి చేసినట్లు కనిపించడం లేదని.. భద్రతా సిబ్బందిపై దాడి చేయాలనే లక్ష్యంతోనే కాల్పులకు పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు. సమారు 7-8 మంది తిరుగుబాటుదారులు కాల్పలకు పాల్పడ్డారు. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఎన్ఎల్ఎఫ్టీ) తరుచుగా భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతోంది.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!