Soldier Killed: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soldier Killed In Militant Attack Near Bangladesh Border: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి జరిగింది. త్రిపురలోని భారత్- బంగ్లా సరిహద్దులో ఈ మిలిటెంట్లకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. ఉత్తర త్రిపురలోని కంచన్ పూర్ సబ్ డివిజన్ పరిధిలోని అనందబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం త్రిపుర-మిజోరాం- బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ సమీపంలో ఎన్ఎల్ఎఫ్టీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
145 బీఎస్ఎఫ్ బెటారియన్ పెట్రోలింగ్ బృందంపై ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు విచక్షణారిహితంగా బీఎస్ఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారు. తేరుకుని బీఎస్ఎఫ్ దళాలు ఎదురుకాల్పులకు దిగే లోపే.. ఉగ్రవాదులంతా అడవిల్లోకి పారిపోయారని.. బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోంది. తీవ్రగాయాల పాలైన గిర్జేష్ కే ఆర్ ఉద్దేని హెలికాప్టర్ లో అగర్తలాకు తరలించారు. అక్కడ ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సరిహద్దుకు అవతలి వైపు నుంచి వచ్చిన ఉగ్రవాదులు సైనికుడిపై కాల్పులు జరిపారు. గతేడాది త్రిపురలోని భారత్-బంగ్లా సరిహద్దుల్లో కూడా ఇలాంటి దాడే జరిగింది. ఎన్ఎల్ఎఫ్టీ ఉగ్రవాదులు పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది మరణించారు.
Also Read
Read Also: Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతుందో తెలుసా?
అయితే ఉగ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ఈ దాడి చేసినట్లు కనిపించడం లేదని.. భద్రతా సిబ్బందిపై దాడి చేయాలనే లక్ష్యంతోనే కాల్పులకు పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు. సమారు 7-8 మంది తిరుగుబాటుదారులు కాల్పలకు పాల్పడ్డారు. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఎన్ఎల్ఎఫ్టీ) తరుచుగా భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతోంది.
తాజావార్తలు
-
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
-
Phool Gobi Yakhni Recipe : ఘుమఘుమలాడే కాశ్మీరీ వంటకం.. పూల్ గోబీ యఖ్నీ తయారీ విధానం..!
-
Storm Hit UP: ఒక్క రోజే 100 మంది మృతి.. యూపీలో తుఫాను బీభత్సం..
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?