Ludhiana: మొత్తం కొట్టేసింది 7 కోట్లుకాదు.. ఎనిమిదిన్నర కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ludhiana: లూథియానాలోని ఓ క్యాష్ కంపెనీలో రూ.7 కోట్ల దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ (సీఎంఎస్) కార్యాలయంలోకి సాయుధ దొంగలు ప్రవేశించి కోట్లాది రూపాయలను ఎత్తుకెళ్లారు. రెండు స్విఫ్ట్ కార్లలో పరారయ్యారు. పోలీసులు కారులోని కొన్ని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు, దాని ఆధారంగా వారి అసలు లొకేషన్ను అన్వేషిస్తున్నారు. లూథియానా పోలీసుల విచారణలో అసలు దోపిడి విలువ ఎనిమిదిన్నర కోట్లు (8.49) కోట్లు అని తేలింది.
మీడియా కథనాల ప్రకారం, కొంతమంది సాయుధ దొంగలు కంపెనీ భవనం వెనుక తలుపు ద్వారా ప్రవేశించారు.. ఆపై మిగిలిన వారు ముందు తలుపు నుండి ప్రవేశించారు. పదునైన ఆయుధాలతో పోరాడి కంపెనీ సెక్యూరిటీ గార్డుతో సహా ఐదుగురు ఉద్యోగులను బందీలుగా తీసుకెళ్లారు. స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఫిరోజ్పూర్ వైపు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగల వద్ద ఎలాంటి పిస్టల్ లేదని, పదునైన ఆయుధాలతోనే వచ్చారని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
- ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
Read Also:Minister KTR: కుసుమ జగదీష్ కుటుంబానికి అండగా ఉంటాం..
లూథియానా-ఫిరోజ్పూర్ రహదారిలోని చౌకీమాన్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద కూడా వారు ఆగలేదు. తెల్లవారుజామున 3.32 గంటలకు అతివేగంతో టోల్ దాటి దుండగులంతా వెళ్లిపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు, అందులో వారు టోల్ దాటినట్లు కనిపించారు. ఈ కుంభకోణంలో తెలిసిన వారి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కంపెనీ వాహనంతో పారిపోయానని, ఆ తర్వాత వాహనం మార్చారని పోలీసు కమిషనర్ మన్దీప్ సింగ్ సిద్ధూ తెలిపారు.
దొంగలను పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత, మాజీ ఉద్యోగుల జాబితాను పోలీసులు కంపెనీని కోరారు. ఇది వారి కాల్ వివరాలు, వారు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. ఆఫీస్లో నగదు ఉంచడం సురక్షితం కాదని ఉద్యోగులు చెప్పినా ఇప్పటికీ సెక్యూరిటీ సిస్టమ్ అప్డేట్ కాలేదని విచారణలో పోలీసులకు తెలిసింది. కార్యాలయంలో 50 సీసీ కెమెరాలు ఉండగా వాటిని ఐదు వీడియో రికార్డర్లకు అనుసంధానం చేసినా స్టోరేజీ రికార్డింగ్ లేదు. సెన్సార్ సిస్టమ్ కూడా నవీకరించబడలేదు.
Read Also:Tamannah : అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న మిల్కీ బ్యూటీ..!!
తాజావార్తలు
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
-
Balakrishna : బాలకృష్ణకు తీవ్ర గాయం.. ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల
-
Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!
-
Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!