Ludhiana: మొత్తం కొట్టేసింది 7 కోట్లుకాదు.. ఎనిమిదిన్నర కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ludhiana: లూథియానాలోని ఓ క్యాష్ కంపెనీలో రూ.7 కోట్ల దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ (సీఎంఎస్) కార్యాలయంలోకి సాయుధ దొంగలు ప్రవేశించి కోట్లాది రూపాయలను ఎత్తుకెళ్లారు. రెండు స్విఫ్ట్ కార్లలో పరారయ్యారు. పోలీసులు కారులోని కొన్ని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు, దాని ఆధారంగా వారి అసలు లొకేషన్ను అన్వేషిస్తున్నారు. లూథియానా పోలీసుల విచారణలో అసలు దోపిడి విలువ ఎనిమిదిన్నర కోట్లు (8.49) కోట్లు అని తేలింది.
మీడియా కథనాల ప్రకారం, కొంతమంది సాయుధ దొంగలు కంపెనీ భవనం వెనుక తలుపు ద్వారా ప్రవేశించారు.. ఆపై మిగిలిన వారు ముందు తలుపు నుండి ప్రవేశించారు. పదునైన ఆయుధాలతో పోరాడి కంపెనీ సెక్యూరిటీ గార్డుతో సహా ఐదుగురు ఉద్యోగులను బందీలుగా తీసుకెళ్లారు. స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఫిరోజ్పూర్ వైపు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగల వద్ద ఎలాంటి పిస్టల్ లేదని, పదునైన ఆయుధాలతోనే వచ్చారని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Read Also:Minister KTR: కుసుమ జగదీష్ కుటుంబానికి అండగా ఉంటాం..
లూథియానా-ఫిరోజ్పూర్ రహదారిలోని చౌకీమాన్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద కూడా వారు ఆగలేదు. తెల్లవారుజామున 3.32 గంటలకు అతివేగంతో టోల్ దాటి దుండగులంతా వెళ్లిపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు, అందులో వారు టోల్ దాటినట్లు కనిపించారు. ఈ కుంభకోణంలో తెలిసిన వారి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కంపెనీ వాహనంతో పారిపోయానని, ఆ తర్వాత వాహనం మార్చారని పోలీసు కమిషనర్ మన్దీప్ సింగ్ సిద్ధూ తెలిపారు.
దొంగలను పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత, మాజీ ఉద్యోగుల జాబితాను పోలీసులు కంపెనీని కోరారు. ఇది వారి కాల్ వివరాలు, వారు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. ఆఫీస్లో నగదు ఉంచడం సురక్షితం కాదని ఉద్యోగులు చెప్పినా ఇప్పటికీ సెక్యూరిటీ సిస్టమ్ అప్డేట్ కాలేదని విచారణలో పోలీసులకు తెలిసింది. కార్యాలయంలో 50 సీసీ కెమెరాలు ఉండగా వాటిని ఐదు వీడియో రికార్డర్లకు అనుసంధానం చేసినా స్టోరేజీ రికార్డింగ్ లేదు. సెన్సార్ సిస్టమ్ కూడా నవీకరించబడలేదు.
Read Also:Tamannah : అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న మిల్కీ బ్యూటీ..!!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!