Ludhiana: మొత్తం కొట్టేసింది 7 కోట్లుకాదు.. ఎనిమిదిన్నర కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ludhiana: లూథియానాలోని ఓ క్యాష్ కంపెనీలో రూ.7 కోట్ల దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ (సీఎంఎస్) కార్యాలయంలోకి సాయుధ దొంగలు ప్రవేశించి కోట్లాది రూపాయలను ఎత్తుకెళ్లారు. రెండు స్విఫ్ట్ కార్లలో పరారయ్యారు. పోలీసులు కారులోని కొన్ని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు, దాని ఆధారంగా వారి అసలు లొకేషన్ను అన్వేషిస్తున్నారు. లూథియానా పోలీసుల విచారణలో అసలు దోపిడి విలువ ఎనిమిదిన్నర కోట్లు (8.49) కోట్లు అని తేలింది.
మీడియా కథనాల ప్రకారం, కొంతమంది సాయుధ దొంగలు కంపెనీ భవనం వెనుక తలుపు ద్వారా ప్రవేశించారు.. ఆపై మిగిలిన వారు ముందు తలుపు నుండి ప్రవేశించారు. పదునైన ఆయుధాలతో పోరాడి కంపెనీ సెక్యూరిటీ గార్డుతో సహా ఐదుగురు ఉద్యోగులను బందీలుగా తీసుకెళ్లారు. స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఫిరోజ్పూర్ వైపు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగల వద్ద ఎలాంటి పిస్టల్ లేదని, పదునైన ఆయుధాలతోనే వచ్చారని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Read Also:Minister KTR: కుసుమ జగదీష్ కుటుంబానికి అండగా ఉంటాం..
లూథియానా-ఫిరోజ్పూర్ రహదారిలోని చౌకీమాన్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద కూడా వారు ఆగలేదు. తెల్లవారుజామున 3.32 గంటలకు అతివేగంతో టోల్ దాటి దుండగులంతా వెళ్లిపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు, అందులో వారు టోల్ దాటినట్లు కనిపించారు. ఈ కుంభకోణంలో తెలిసిన వారి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కంపెనీ వాహనంతో పారిపోయానని, ఆ తర్వాత వాహనం మార్చారని పోలీసు కమిషనర్ మన్దీప్ సింగ్ సిద్ధూ తెలిపారు.
దొంగలను పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత, మాజీ ఉద్యోగుల జాబితాను పోలీసులు కంపెనీని కోరారు. ఇది వారి కాల్ వివరాలు, వారు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. ఆఫీస్లో నగదు ఉంచడం సురక్షితం కాదని ఉద్యోగులు చెప్పినా ఇప్పటికీ సెక్యూరిటీ సిస్టమ్ అప్డేట్ కాలేదని విచారణలో పోలీసులకు తెలిసింది. కార్యాలయంలో 50 సీసీ కెమెరాలు ఉండగా వాటిని ఐదు వీడియో రికార్డర్లకు అనుసంధానం చేసినా స్టోరేజీ రికార్డింగ్ లేదు. సెన్సార్ సిస్టమ్ కూడా నవీకరించబడలేదు.
Read Also:Tamannah : అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న మిల్కీ బ్యూటీ..!!
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!