Love Couples: అనుమానస్పద స్థితిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
- ప్రేమ జంట అనుమానస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం
- ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ కోసం ప్రాణాలు తీయడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రామచంద్రపురం పి యస్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్ లో చోటుచేసుకుంది. చనిపోయిన యువతిని రమ్యగా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రియుడు ప్రవీణ్ ను ఆస్పత్రికి తరలించారు.
Also Read:Hacking: ఇది హ్యాకింగ్ మొదటిదెబ్బ..! జాగ్రత్త.. మీ ఫోన్ డేంజర్లో ఉండొచ్చు..!
Also Read
మృతురాలు రమ్య డిగ్రీ చదువుతోంది. కొంతకాలంగా ఆకుల ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఏవో కారణాలతో ఇద్దరిమధ్య గ్యాప్ ఏర్పడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యువతి ఇంట్లో గొంతుపై కత్తి గాట్లతో రక్తపు మడుగులో పడి ఉన్నారు యువతి, యువకుడు. స్పాట్ లోనే రమ్య మృతి చెందగా, అపస్మారక స్థితిలో ప్రవీణ్ ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. రమ్య మెడపై కత్తితో దాడి చేసి అనంతరం ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా అని తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆర్సీపురం పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తాజావార్తలు
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?