Loud Speakers row: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. లౌడ్ స్పీకర్లపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా లౌడ్ స్పీకర్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయంగా రచ్చ జరుగుతోంది. మసీదుల్లో, ఇతర ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తాజాగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ బస్వరాజ్ బొమ్మై సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత తప్ప లౌడ్ స్పీకర్లు వినియోగించరానది ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిటోరియం, కాన్ఫరెన్స్ రూమ్ లు, కమ్యూనిటీ హాల్స్ తో పాటు మూసి ఉన్న ప్రాంగణాల్లో తప్పితే ఇతర బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో శబ్ధ తీవ్రత 10 డెసిబల్స్ కు మించరాదనే సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సర్కార్ చెబుతోంది.
Also Read
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
ఇటీవల కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కర్ణాటకలో హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. విద్యాలయాలకు హిజాబ్ ధరించి రావడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్ట్ కూడా సమర్థించింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. ప్రస్తుతం లౌడ్ స్పీకర్ల వివాదం కర్ణాటకలో లౌడ్ స్పీకర్ వివాదం నడుస్తోంది. అయితే ప్రతిపక్షాలు, ఓ వర్గం ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నాయి. ఇక మహారాష్ట్రలో కూడా లౌడ్ స్పీకర్ వర్సెస్ హనుమాన్ చాలీసా వివాదం నడుస్తోంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, శివసేన సర్కార్ మధ్య లౌడ్ స్పీకర వివాదం ముదురుతోంది. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రార్థనలు వినిపిస్తే దీనికి ప్రతిగా పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా వినిపిస్తామంటూ ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు రాజ్ ఠాక్రే. మరోవైపు ఈ వివాదంలోకి అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా కూడా చేరారు. ఇటీవల సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించి అరెస్ట్ అయ్యారు.
తాజావార్తలు
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.