Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Lok Sabha Speaker To Be Named On June 26 Odisha Andhra Leaders On List Say Sources

Lok sabha speaker: లోక్‌సభ స్పీకర్‌ రేసులో ఏపీ, ఒడిశా నేతలు!

Published Date :June 17, 2024 , 8:25 pm
By Suresh Maddala
  • లోక్‌సభ స్పీకర్‌ రేసులో ఏపీ.. ఒడిశా నేతలు!
  • భర్తృహరి మహతాబ్.. పురందేశ్వరి పేర్లు పరిశీలన
  • పురందేశ్వరికి అవకాశం దక్కే ఛాన్స్!
Lok sabha speaker: లోక్‌సభ స్పీకర్‌ రేసులో ఏపీ, ఒడిశా నేతలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈనెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే ఈ పోస్టు కోసం ఎన్డీఏ కూటమిలో పోటీ నెలకొంది. స్పీకర్ పోస్టు సొంతం చేసుకోవాలని ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన జేడీయూ, తెలుగు దేశం పార్టీలు భావిస్తున్నాయి. కానీ కీలకమైన ఆ పోస్టు బీజేపీ వదులుపెట్టుకోకూడదని భావిస్తోంది. దీని కోసం కమలనాథులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పోస్టు ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా నేతలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఒడిశాకు చెందిన భర్తృహరి మహతాబ్, ఏపీకి చెందిన రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరి పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరి.. టీడీపీకి దగ్గర మనిషి కావడం. పైగా పురందేశ్వరి బీజేపీ ఎంపీ కావడంతో ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇటీవలే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఒడిశాలో బీజేడీ నుంచి బీజేపీలో చేరిన భర్తృహరి మహతాబ్ పేరును కూడా పరిశీలిస్తు్న్నట్లు సమాచారం. ఇతను డిబేట్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 2017, 2018, 2019, 2020 సంసద్ రత్న అవార్డును కూడా అందుకున్నారు. ఒడిశాలోని కటక్ నియోజకవర్గం నుంచి 1998లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1999, 2009, 2014, 2019లో తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక 2017లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈయన పేరును కూడా కాషాయ పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సారి లోక్‌సభ స్పీకర్ పోస్టును ఒడిశా లేదా ఏపీకి ఇవ్వాలని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంది.

ఇక పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. జూన్ 26న ప్రధాని నరేంద్ర మోడీ స్పీకర్ పేరుపై తీర్మానాన్ని ప్రవేశపెడతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తీర్మానం ఆమోదించబడిన తర్వాత సభకు పరిచయం చేస్తారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి కూడా స్పీకర్ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగిగే స్పీకర్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం అంగీకరించకుంటే స్పీకర్‌ అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేస్తున్నాయి.

పురందేశ్వరి 2004లో బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో విశాఖ నుంచి రెండోసారి విజయం సాధించి.. యూపీఏ హయాంలో హన్మోహన్ సింగ్ కేబినెట్‌లో వాణిజ్యం, పరిశ్రమల, మానవ మనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2014లో బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇంఛార్జ్‌గా.. అటు తర్వాత 2023, జూలై 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే జూన్ 24న 18వ పార్లమెంటు సమావేశాల్లో స్పీకర్‌ను నియమించే వరకు కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేరళలోని మావెలికరాకు చెందిన 68 ఏళ్ల ఎంపీ అత్యధిక కాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటు సమావేశానికి ముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రధాని మంత్రి, కేంద్ర కేబినెట్, ఇతర ఎంపీలతో ఆయన ప్రమాణం చేయిస్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra leaders
  • June 26
  • Lok Sabha speaker
  • Named
  • Odisha

తాజావార్తలు

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Supreme Court: ‘‘సెలవులు కావాలంటే ఉద్యోగాలివ్వరు’’.. రుతుక్రమంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • Couple Friendly: ఓటీటీలోకి వచ్చేసిన డార్లింగ్ ప్రభాస్ మెచ్చిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా.. ఎక్కడ చుడొచ్చంటే..?

  • LPG Booking Messages Without Booking: గ్యాస్‌ ఏజెన్సీల గోల్‌మాల్‌..! LPG బుక్‌ చేయకుండానే.. బుక్‌ చేసినట్టు మెసేజ్‌లు..

  • Tollywood Upcoming Movies: శర్వానంద్ నుంచి నిఖిల్ వరకు.. ఏప్రిల్‌లో యువ హీరోల మూవీ జాతర!

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions