Liquor Sales: ఎన్నికల వేళ ఏరులై పారుతోన్న మద్యం.. అమాంతం పెరిగిన సేల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: ఎన్నికల కమిషన్ ఆంక్షలు.. సీసీ కెమెరాలు..ము మ్మరంగా తనిఖీలు… మద్యం మాట వినిపించకుండా అధికారులు, పోలీసులు అష్టదిగ్బంధనం చేసినా అది తన టార్గెట్ రీచ్ అవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా మద్యం పార్టీల నేతలకు చేరిపోతూనే ఉంది. రోజువారీ మద్యం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే పెరగకూడదని ఈసీ ఆంక్షలు విధించింది. ఆంక్షలు ఆంక్షల్లాగే ఉన్నాయి. మద్యం మాత్రం అందరి కళ్లుగప్పి బయటకు వస్తూనే ఉంది. కంపెనీల నుంచే నేరుగా నేతలకు చేరుకుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని పార్టీలకు కర్ణాటక, తమిళనాడు నుంచి సరుకు వస్తోందని పోలీసులు అంటున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి కూడా లిక్కర్ తరలిపోతోంది. తెరిచీ తెరవగానే నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నాయి వైన్ షాప్లు.
Read Also: PM Modi: ‘‘ఒక సంవత్సరం, ఒక ప్రధాని’’.. ఇండియా కూటమిపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
- EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
2023 మార్చిలో 2 వేల 357 కోట్ల రూపాయలు విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 27 లక్షల 63 వేల 924 లిక్కర్ కేసులు, 9 లక్షల 78 వేల 331 బీర్ కేసులు అమ్ముడుపోయాయి. 2024 మార్చిలో 2 వేల 590 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. 29 లక్షల 13 వేల 463 లిక్కర్ కేసులు, 10 లక్షల 54 వేల 886 బీర్ కేసులు సేల్ అయ్యాయి. మార్చి నెల మొదట్లోనే ఎన్నికల కోసం ముందు జాగ్రత్తగా మద్యం కొనుగోళ్ళు చేశారు మందుబాబులు. మార్చిలో అత్యధిక సేల్స్ జరగడంతో ఏప్రిల్లో అమ్మకాలు తగ్గాయి. ఒక్క మార్చిలోనే 9.87 శాతం అమ్మకాల పెరుగుదలకు ఏప్రిల్ , మే లలో ఎన్నికల ఆంక్షలు ఉండటమే కారణమని అంచనా వేస్తున్నారు.
Read Also: Loksabha 2024: తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగు నటి..
మందు కోసం షాపుల దగ్గర కస్టమర్లు క్యూ కడుతున్నారు. ఎండను లెక్కచేయకుండా దుకాణాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అయితే తెరిచిన గంటకే నో స్టాక్ బోర్డు పెట్టి మూతపడుతున్నాయి మద్యం షాపులు. డబ్బులు పెట్టినా మందు దొరక్కపోవడంతో షాపు నిర్వాహకులతో గొడవకు దిగుతున్నారు కస్టమర్లు. సరుకు ఉన్నా తమకు అమ్మకుండా పక్కదారి పట్టిస్తున్నారంటూ వీరంగం వేస్తున్నారు. అయితే ఇచ్చిన టార్గెట్ పూర్తయ్యాక షాపులు మూసేస్తున్నామంటున్నారు సేల్స్మెన్స్.
తాజావార్తలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!