Liquor Price Hike : మందుబాబులకు అలర్ట్.. రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు కొంత అదనపు ఆదాయం కావాలి. ఈ మేరకు ప్రస్తుతం మద్యం ధర పెంచితే అదనపు ఆదాయం వస్తుంది. ఇలా అన్ని రకాల ఆల్కహాల్ బ్రాండ్ల ధరలను 20-25% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడా ఒకటి. ఈ ధరలు పెంపుపై వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏటా ప్రభుత్వానికి రూ.37 వేల కోట్లు వరకు సమకూరుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాలు అమలుకు ఈ పెరిగిన ఆదాయం కచ్చితంగా అక్కరకు వస్తుంది. కాబట్టి దాదాపుగా ధరలు పెంచే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!