శ్రీశైలం జలాశయం గేట్లను అధికారులు కాసేపటి క్రితం ఎత్తేశారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 3 గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.67,210 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.. మరోవైపు.. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో.. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటికే 62,725 క్యూసెక్కుల నీటిని వాడుతూ.. దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 879.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 182.6050 టీఎంసీలు ఉంది.
Srisailam Dam: తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు..
- శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత
- 3 గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల
- ఇన్ ఫ్లో : 4..67..210 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 63138 క్యూసెక్కులు
- పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 879.90 అడుగులు.
![Srisailam Dam](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/07/Srisailam-dam-1024x576.jpg)
Srisailam Dam