Welfare Schemes: 561 గ్రామాల్లో నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభం
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 561 గ్రామాల్లో నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభం.
- లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Welfare Schemes: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మరో ముందడుగుగా 561 గ్రామాల్లో నాలుగు కీలక పథకాలను ఏకకాలంలో ప్రారంభించారు అధికారులు. లబ్ధిదారులకు పత్రాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు.
Also Read: Vehicle Scrapping Policy : ఈ పని చేస్తే చాలు.. జంక్ వాహనంపై మీకు డబుల్ టాక్స్ మినహాయింపు
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఈ వివరాలను చూస్తే.. రైతు భరోసాకు 3,07,318 మంది లబ్ధిదారులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 20,336 మంది లబ్ధిదారులు, 42,267 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కింద 72,406 గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక వీటి అమలుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారు. ప్రభుత్వం మార్చి 31లోపు అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఈ నాలుగు పథకాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గ్రామంలో ఏకకాలంలో ఈ పథకాలు అమలుచేయడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
Also Read: Amit Shah : ప్రయాగ్రాజ్ చేరుకున్న హోంమంత్రి అమిత్ షా.. మరికొద్ది సేపట్లో సంగంలో పవిత్ర స్నానం
ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు వెంటనే జమ చేయనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం, సామాజిక సమీకరణాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రజల జీవితాల్లో అద్భుత మార్పులను కలిగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రభుత్వ కృషి ప్రజల్లో విశ్వాసం పెంచుతుందని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ చొరవ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!