Landslide: మహారాష్ట్రలోని రాయగఢ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో 30కి పైగా కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయని భయాందోళన చెందుతున్నారు. గిరిజన గ్రామం ఇర్షాల్వాడి ఉన్న ఖలాపూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామంలో గిరిజనులకు చెందిన 46 ఇళ్లు ఉన్నాయని, అందులో 5..6 ఇళ్లు మాత్రమే ఈ ప్రమాదంలో పడకుండా మిగిలిపోయాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. శిథిలాల నుండి 25 మందిని రక్షించారు, వారిలో 21 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి పంపారు.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఘటనాస్థలికి సమీపంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ను రాయగడ ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఘటనా స్థలానికి మరో రెండు బృందాలను పంపించారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయ్గఢ్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం రెడ్ అలర్ట్ ప్రకటించింది.
#WATCH | Maharashtra: Rescue operation underway by NDRF after a landslide occurred in Irshalwadi village of Khalapur tehsil of Raigad district.
According to the Raigad police, four people have died and three others have been injured. pic.twitter.com/z14SKMjyuK
— ANI (@ANI) July 20, 2023
Read Also:IND vs WI: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు.. 100లో అయినా పోటీ ఉంటుందా?
ఉప్పొంగుతున్న నదులు
గత రెండు రోజులుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వరద ముప్పు పొంచి ఉంది. రాయగడలోని 6 నదులలో సావిత్రి, పాతాళగంగ అనే రెండు పెద్ద నదులు ఉప్పొంగుతున్నాయి. కుండలికా, అంబా నదులు కూడా తమ హెచ్చరిక స్థాయికి చేరుకున్నాయి. ఇవి కాకుండా గర్హి, ఉల్హాస్ అనే రెండు నదుల నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది. భారీ వర్షాల తర్వాత వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని, NDRF బృందాన్ని ఇక్కడ మోహరించారు. ఇప్పుడు ఖలాపూర్లో కొండచరియలు విరిగిపడటంతో మరో మూడు బృందాలను ఇక్కడికి రప్పించారు.
మూతపడ్డ పాఠశాలలు
రాయ్గఢ్ సహా ముంబై, థానే, పాల్ఘర్లోని పాఠశాలలను మూసివేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా రాయ్గఢ్, రత్నగిరి, థానే, పాల్ఘర్, ముంబై, సింధుదుర్గ్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 బృందాలను ఎన్డీఆర్ఎఫ్ మోహరించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చెందిన ఐదు బృందాలను ముంబైలో మోహరించారు. ఇవి కాకుండా రాయ్గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, పాల్ఘర్, సాంగ్లీ, నాగ్పూర్, థానేలలో ఒక్కొక్క టీమ్ను మోహరించారు.
కాలువలో కొట్టుకుపోయిన చిన్నారి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా అంబర్నాథ్ లోకల్ రైలు ఠాకుర్లీ సమీపంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు రైలు దిగి కాలినడకన వెళ్తున్నారు. ఓ మహిళ కూడా నడుచుకుంటూ డ్రెయిన్ దాటుతోంది. అకస్మాత్తుగా ఆమె నాలుగు నెలల చిన్నారి ఆ మహిళ చేతిలో నుంచి జారి డ్రెయిన్ లో పడిపోయింది. కొద్దిసేపటికే ఆ చిన్నారి ప్రవాహవేగానికి కాలువ నీటిలో కొట్టుకుపోయింది. ఆ మహిళ అక్కడ కేకలు వేయడం ప్రారంభించింది, కానీ ఏమీ చేయలేకపోయింది. ఆ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తరువాత, RPF, SDRF మరియు GRP బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది, కానీ చిన్నారి గురించి ఆచూకీ లభించలేదు.
मुंबई में भारी बारिश @Central_Railway बाधित
कल्याण-ठाकुर्ली के बीच करीब दो घंटे से खड़ी अंबरनाथ लोकल से उतरकर कुछ यात्री पटरी पर कल्याण स्टेशन की तरफ चल रहे थे, इनमें एक आदमी की गोद से 4 माह का बच्चा फिसलकर नाले में गिरकर बह गया।
यह अत्यंत दुर्दैवी घटना 2:55 बजे घटित हुई!🙂 pic.twitter.com/Tzw7lid9sw— RAILWHISPERS (@Railwhispers) July 19, 2023
Read Also:Army Officer: అగ్ని ప్రమాదంలో ఆర్మీ ఆఫీసర్ మృతి.. మరో ముగ్గురికి గాయాలు