Crime: పనికోసం వచ్చిన గిరిజన బాలికపై భూయజమాని అత్యాచారం.. గర్భం దాల్చడంతో అబార్షన్!
- రంగారెడ్డి జిల్లా ఎర్రకుంట తండాలో దారుణం
- మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారం
- బాధితురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించిన నీచుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy Crime: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎర్రకుంట తండాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు ఆ దుర్మార్గుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Boy Kidnap: మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
అసలేం జరిగిందంటే.. తండ్రితో కలిసి పనికి వెళ్లి గిరిజన బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆమెపై కన్నేసిన భూయజమాని కృష్ణారెడ్డి(30) బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి భయపడి ఆమె నోరు విప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. బాలికను ఆ యజమాని కొత్తూరుకు తీసుకెళ్లాడు. ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసినా వైద్యుడికి డబ్బు ఇచ్చి అబార్షన్ చేయించాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో తండా, గ్రామపెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎలాగో తప్పు జరిగిందని.. ఎంతో కొంత ఇచ్చి రాజీ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. బాలిక డబ్బులకు లొంగలేదు. మంగళవారం సాయంత్రం శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కొత్తూర్ గ్రామంలోని శ్రీనివాస హాస్పిటల్ డాక్టర్ రంజిత్ రెడ్డి గర్భం తీసేసినట్లు తెలిసింది. నిందితుడు కృష్ణారెడ్డితో పాటు డాక్టర్ రంజిత్ రెడ్డి,మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..