Lakhpati Didi Yojana: మహిళలకు వడ్డీ లేకుండా రూ. 5 లక్షలు.. షరతులు వర్తిస్తాయి
- కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.
- 'లక్షపతి దీదీ యోజన' అనే పథకాన్ని ప్రారంభించింది.
- రూ. 5 లక్షల వరకు రుణం ఇవ్వబడుతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakhpati Didi Yojana: భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వివిధ వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువస్తుంది. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకురావడానికి కారణం ఇదే. గతేడాది కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ‘లక్షపతి దీదీ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. పరిశ్రమ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు వారికి ఆర్థిక సాయం అందించదానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ఇందుకోసం మహిళలు కొన్ని షరతులు పాటించాలి.
Happy Birthday Sarfaraz Khan: సర్పరాజ్ కు డబుల్ ధమాకా.. పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్
Also Read
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
- FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
లఖపతి దీదీ పథకం అంటే?
మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. లఖపతి దీదీ యోజన కూడా అదే ప్రయత్నం. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళల కోసం ఈ పథకం అమలు చేయబడింది. ఈ పథకం ద్వారా మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయం చేస్తారు. స్త్రీలు స్వయం ఉపాధికి ముందుకొస్తారు. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద శిక్షణ ఇస్తారు. ఆపై సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణం ఇస్తారు. ఈ పథకం కింద 3 కోట్ల మంది మహిళలను లఖపతి దీదీ పథకంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
లఖపతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని పత్రాలు మహిళలు అందించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన షరతు ఏంటంటే.. ఈ పథకం కింద ఎవరైనా మహిళ దరఖాస్తు చేసుకుంటే.. వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ ఉండకూడదు. అలాగే వీరి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి . 3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న మహిళలు ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులు కాదు.
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే దర్శన టికెట్లతో పాటు వివిధ సేవా టికెట్లు విడుదల
పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
లఖపతి దీదీ యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్వయం సహాయక బృందం కింద మహిళల కోసం వ్యాపార ప్రణాళికను రూపొందించాలి. వారి వ్యాపార ప్రణాళిక రూపొందించిన వెంటనే, స్వయం సహాయక బృందం ద్వారా ఆ ప్రణాళిక ప్రభుత్వానికి పంపబడుతుంది. దాంతో ప్రభుత్వ అధికారులు దరఖాస్తును సమీక్షిస్తారు. ఆ తర్వాత, దరఖాస్తును ఆమోదించినట్లయితే పథకం ప్రయోజనం ఇవ్వబడుతుంది. దాని కింద రూ. 5 లక్షల వరకు రుణం ఇవ్వబడుతుంది.
తాజావార్తలు
-
Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
-
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్బస్టర్ హిట్.. నాన్న చరణ్కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
-
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!