Monkey: కోతులను తరిమేందుకు ఎలుగుబంట్లుగా మారుతున్న రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkey: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో రైతులు భిన్నమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువులతో ప్రజలు ఆగమాగమవుతున్నారు. లఖింపూర్ రైతులు మాత్రం కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కోతులు చెరుకు రైతులను తీవ్ర అవస్థల పాలు చేస్తున్నాయి. చెరకు పంటను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు స్థానిక రైతులు మరో మార్గాన్ని కనుగొన్నారు. ఇక్కడి రైతులే స్వయంగా ఎలుగుబంటి దుస్తులు కొనుగోలు చేశారు. కోతులతో తట్టుకోలేకపోతున్నామని.. ఇది తప్ప మరో మార్గం గురించి ఆలోచించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.
Read Also:500 Note: రూ.500 నోటు గురించి బిగ్ న్యూస్.. అసలు విషయాన్ని బయటపెట్టిన PIB..!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇది లఖింపూర్ ఖేరీలోని జహాన్ నగర్ గ్రామానికి సంబంధించినది. ఈ గ్రామంలోని రైతులు కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి దుస్తులు కొనుగోలు చేసి పొలాల్లో కూర్చున్నారు. ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో కోతులు సంచరిస్తున్నాయని, అయితే ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పంటలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంగా రైతులే రకరకాల మాయలతో కోతులను తరిమికొడుతున్నారు. అంతే కాకుండా కొంత మంది రైతులు పొలాల్లో ఎలుగు బంటి డ్రస్ వేసుకుని కాపలా గా ఉంటే రూ.250 కూలీ చెల్లిస్తున్నారు.
Uttar Pradesh | Farmers in Lakhimpur Kheri's Jahan Nagar village use a bear costume to prevent monkeys from damaging their sugarcane crop
40-45 monkeys are roaming in the area and damaging the crops. We appealed to authorities but no attention was paid. So we (farmers)… pic.twitter.com/IBlsvECB2A
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 25, 2023
Read Also:Gold Seize: బీఎండబ్ల్యూ కారులో మ్యాట్ కింద 12 కేజీల బంగారం.. విలువ రూ.7కోట్లు
స్థానిక రైతు గజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 40 నుంచి 45 కోతులు సంచరిస్తున్నాయి. ఈ కోతుల వల్ల చెరకు పంటలకు చాలా నష్టం వాటిల్లుతోంది. మేము కూడా పరిపాలనకు విజ్ఞప్తి చేసినప్పటికీ వినలేదు. ఇప్పుడు మేము మా పంటలను కాపాడుకోవడానికి విరాళాలు అందించి 4000 రూపాయలకు ఈ దుస్తులను కొనుగోలు చేసాం. ఇలా కోతుల మధ్య వేషం వేసుకుని కూర్చోవడం ప్రమాదకరం.. కానీ రైతులు నిస్సహాయంగా మారారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లా చెరకు సాగుకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెద్ద ఎత్తున చెరకు సాగు చేస్తుండగా, కోతుల బెడదతో రైతుల పంటలు భారీగా నష్టపోతున్నాయి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!