Kushi : సినిమా ప్రమోషన్స్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ, సమంత జంట గా నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి అయింది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.గత ఏడాది విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తీవ్రం గా నిరాశ పరిచింది..విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలవడం తో ప్రస్తుతం చేస్తున్న ఖుషి సినిమా పైనే విజయ్ దేవరకొండ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. ఖుషి సినిమా ను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే విడుదల అయిన పాటలు.మరియు పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు చాలా ఉన్నాయనీ తెలుస్తుంది.. అందుకే ఖుషి సినిమా ను భారీ ఎత్తున ప్రమోట్ చేయాలని విజయ్ దేవరకొండ అభిమానులు కూడా కోరుతున్నారు.కానీ సమంత మయోసైటీస్ డిసీజ్ కు మరోసారి ట్రీట్మెంట్ తీసుకోవడానికి విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం.దాంతో ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఆమె హాజరు అవ్వదని తేలిపోయింది.
అంతే కాకుండా ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమాకు కాస్త ముందు గానే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నట్లు సమాచారం.చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఆగస్టు 15 నుండి షురూ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.. సినిమా కు సంబంధించిన మొదటి ప్రమోషనల్ మీడియా మీట్ ను ఆగస్టు 15 సందర్భంగా ఏర్పాటు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. అదే సమయం లో సినిమా కి సంబంధించిన ఒక కీలకమైన ఒక వీడియోను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 1వ తేదీన ఖుషి సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ నేపథ్యం లో ప్రమోషన్ కార్యక్రమాలు కేవలం రెండు వారాలు మాత్రమే చేస్తే ఎలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!