Kurnool : వివాహేతర బంధం.. వేట కొడవళ్లతో దాడి చేసి దారుణ హత్య..
- సూదిరెడ్డిపల్లిలో శేషన్నఅనే వ్యక్తి దారుణ హత్య
- కర్రలు, వేట కొడవలితో దాడి చేసిన నలుగురు వ్యక్తులు
- పరశురాముడు, మరో ముగ్గురు కలిసి దారుణం
- పరశురాముడు, శేషన్న కుటుంబాల మధ్య గొడవలు
- భార్యతో శేషన్నకు వివాహేతర బంధం ఉందని అనుమానం
వివాహేతర సంబంధాలు, అనుమానాలతో హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా కాలు నరికి బైక్పై తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అంతే కాదు.. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్లో చిత్రీకరించారు.
READ MORE: Minister Nimmala Ramanaidu: వైసీపీ విధ్వంస పాలనలో 450 ఎత్తిపోతల పథకాలు మూత.. మంత్రి ఆరోపణ..
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో శేషన్నఅనే వ్యక్తి దారుణంగా నరికి హత్య చేశారు. శేషన్న అనే వ్యక్తి ఇంట్లో
ఉండగా మాట్లాడాలని వెళ్లిన నలుగురు వ్యక్తులు కర్రలు, వేట కొడవలితో దాడి చేశారు. వేటకొడవలితో రెండు కాళ్లు నరికేశారు. ఒక కాలు పూర్తిగా నరికి బైక్లో తమ వెంట తీసుకువెళ్లారు నిందితులు. పరశురాముడు, మరో ముగ్గురు కలసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రస్తుతం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. తమతోపాటు తెచ్చిన కాలును చూసి పోలీసులు విస్తుపోయారు..
READ MORE: Crime: వితంతు, భర్తలకు దూరంగా ఉండే మహిళలే టార్గెట్.. కానిస్టేబుల్గా నటిస్తూ లైంగిక దోపిడి..
సూదిరెడ్డిపల్లిలో నివాసముంటూ శేషన్న డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన పరశురాముడు, శేషన్న కుటుంబాల మధ్య గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. పరుశురాముని భార్యతో శేషన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నారు. ఎలాగైనా శేషన్నను హత్య చేయాలని నిర్ణయించుకున్న పరశురాముడు ప్లాన్ ప్రకారం రాత్రి శేషన్న ఇంట్లో ఉండగా మరో ముగ్గురిని కలుపుకొని వారి ఇంటికి వెళ్లారు. శేషన్న మంచంపై పడుకొని ఉండగా వేటకొడవళ్ళు, కర్రలతో దాడి చేశారు. రెండు కాళ్ళు నరికివేశారు.
READ MORE: Most-Wanted Terrorists: ఏపీలోని ఆ రెండు జిల్లాల్లో ఉగ్రమూకల కలకలం..
ముందుగా గ్రామంలో తిరిగి ఆ తరువాత ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇంటికి వెళ్లారు. రాత్రి వేళ రక్తపు దుస్తులతో చేతిలో నరికిన కాలు పట్టుకొని నిందితులు రావడంతో ఎమ్మెల్యే దస్తగిరి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొద్ది సేపటికి తేరుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని.. పోలీస్ స్టేషన్కు వెళ్లాలని కేకలు వేసి వారిని పంపించేశారు. నిందితులు నరికిన కాలు అలాగే చేతిలో పట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ రాత్రి వేళ నరికిన కాలుతో నిందితులు స్టేషన్కు రావడంతో విస్తుపోయారు పోలీసులు. ఏమి జరిగిందో వారి నుంచి వివరాలు తెలుసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శేషన్న పిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. మనవళ్ళు, మనవరాలు ఉన్నారు. తమ తండ్రిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు శేషన్న కుమార్తెలు..
తాజావార్తలు
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
-
Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?