Site icon NTV Telugu

Kunamneni Sambasiva Rao : ఒడిశా ఘటనకు ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించాలి

Kunam Neni

Kunam Neni

ఒడిశాలోని బాలసోర్‌ జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది మృతి చెందగా, 1000 మంది గాయపడిన ఘటనకు ప్రధాని నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతులకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిపిఐ కార్యదర్శి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా కేంద్రం విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు. ప్రధాన మంత్రి కవాచ్ అనే యాంటీ-కాల్షన్ సిస్టమ్ గురించి పెద్ద వాదనలు చేశారని, అయితే ఇప్పటికీ ప్రమాదం జరగడం రైల్వే అసమర్థతను తెలియజేస్తోందని ఆయన అన్నారు.

Also Read :Chammak chandra : జబర్దస్త్ లోకి రాకముందు చమ్మక్ చంద్ర ఇలాంటి పనులు చేశాడా?

ఈ ప్రమాదంపై కేంద్రం సమగ్ర విచారణ జరిపి రైల్వే భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రైల్వేలను ఆధునీకరిస్తున్నామని కేంద్రం చెబుతున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, మోదీ ప్రభుత్వం రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నప్పటికీ రైలు భద్రతను విస్మరించిందన్నారు.

Also Read : BANK: HDFC ఖాతాదారులకు గమనిక.. ఆ రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం..!

Exit mobile version