KTR: నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్..
- ఫార్ములా ఈ-రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
- రేపు ఈడీ విచారణకు మాజీ మంత్రి
- ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు.. రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో.. ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం నోటీసులు జారీ చేశాయి. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపునకు సంబంధించి ఏసీబీ ప్రశ్నించనుంది. ఈ క్రమంలో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఎఫ్ఈఓకు రూ.45.71 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండానే నిధులు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో.. కేటీఆర్తో పాటు, బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్లకు కూడా నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.
Read Also: CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు.. ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’కు శ్రీకారం!
Also Read
- Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న హెచ్ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. గడువు కావడంతో వారు ఈమెయిల్ ద్వారా అభ్యర్థన పంపారు. ఈ నేపథ్యంలో వీరి విచారణను తాత్కాలికంగా వాయిదా వేసి, కొత్త తేదీలతో ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారనే ఆరోపణలతో, మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ పూర్వ కమిషనర్ అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పై అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కేసులో ఈనెల 7న హాజరుకావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నేపథ్యంలో ఏసీబీ సైతం నోటీసులు జారీ చేయడంతో ఫార్ములా ఈ రేసు కేసులో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Read Also: MARCO : రూ. 100 కోట్ల క్లబ్ లో ఉన్ని ముకుందన్ ‘మార్కో’
తాజావార్తలు
-
Kiran Abbavaram: జన నాయగన్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదు !
-
Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. “బుర్రలేని దర్శకులతో పని చేయడమే నా అదృష్టం!”
-
Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!