KTR: నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్..
- ఫార్ములా ఈ-రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
- రేపు ఈడీ విచారణకు మాజీ మంత్రి
- ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు.. రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో.. ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం నోటీసులు జారీ చేశాయి. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపునకు సంబంధించి ఏసీబీ ప్రశ్నించనుంది. ఈ క్రమంలో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఎఫ్ఈఓకు రూ.45.71 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండానే నిధులు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో.. కేటీఆర్తో పాటు, బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్లకు కూడా నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.
Read Also: CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు.. ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’కు శ్రీకారం!
Also Read
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న హెచ్ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. గడువు కావడంతో వారు ఈమెయిల్ ద్వారా అభ్యర్థన పంపారు. ఈ నేపథ్యంలో వీరి విచారణను తాత్కాలికంగా వాయిదా వేసి, కొత్త తేదీలతో ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారనే ఆరోపణలతో, మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ పూర్వ కమిషనర్ అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పై అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కేసులో ఈనెల 7న హాజరుకావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నేపథ్యంలో ఏసీబీ సైతం నోటీసులు జారీ చేయడంతో ఫార్ములా ఈ రేసు కేసులో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Read Also: MARCO : రూ. 100 కోట్ల క్లబ్ లో ఉన్ని ముకుందన్ ‘మార్కో’
తాజావార్తలు
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
-
Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!