KTR : హైకోర్టులో ఫార్ములా కేసు సంబంధించిన ప్రశ్నలు ఇవే..
- కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
- ఏసీబీ తరుఫున వాదనలు వినిపిస్తున్న AG సుదర్శన్
- ఇప్పటికే పూర్తయిన కేటీఆర్ తరుపు లాయర్ వాదనలు
- కేటీఆర్ తరుఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏసీబీ తరుఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ పైన నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు లాయర్ సిద్ధార్థ్ దవే కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం బదిలీ అయిన డబ్బు FEO కు చేరింది.. 55 కోట్ల బదిలీ లో ఎక్కడా అవినీతి జరగలేదని, ఎలక్షన్ కోడ్ కు ముందే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అగ్రిమెంట్ జరిగిందని.. దీనికి ఎన్నికల నిబంధనలు వర్తించవు
కేటీఆర్ తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. పాలసీ నిర్ణయాలకు మాత్రమే ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయని కోర్టుకు తెలిపారు లాయర్. ఈ కేసులో కేటీఆర్ A1 గా చేర్చినప్పుడు FEO ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సిద్ధార్థ్ దవే ప్రశ్నించారు.
Komatireddy Venkat Reddy : నల్గొండ ప్రజల దశాబ్దాల కల SLBC
Also Read
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
ఇదిలా ఉంటే.. FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు .. కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని AG సుదర్శన్ రెడ్డి వాదించారు. మూడు దఫాలుగా నగదు బదిలీ చేశారని, 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చిందని, ఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది హైకోర్టు.
ఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని న్యాయస్థానం ప్రశ్నించడంతో.. కేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయని ప్రభుత్వ తరుపు న్యాయ వాది తెలిపారు. నిబంధనలు ఎలా ఉల్లంఘించారు అది చెప్పండని, ఈ ఫార్ములా కేసులో ఎలాంటి విధివిధానాలు ఫాలో కాలేదో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించడంతో.. ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతులు పొందలేదని, HMDAగా పార్టీ కానప్పుడు FEO కు డబ్బులు ఎలా చెల్లిస్తుందని, అనుమతులు లేకుండానే FEO సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని, ఇలా నగదు బదిలీ చేయడం వల్ల 8 కోట్లు హెచ్ఎండిఏకు అదనపు భారం పడిందని, మునిసిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందన్నారు ప్రభుత్వం తరుపు లాయర్. అయితే.. వాదనలు ముగిసిన అనంతరం.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అంతేకాకుండా.. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం తెలిపింది.
తాజావార్తలు
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!