Site icon NTV Telugu

KTR : ఉత్తమ్‌ మాట్లాడేది మాకే అర్థం కాలేదు.. ప్రజలకు ఏం అర్ధంమౌతుంది..?

Ktr

Ktr

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని, ఆయన మాట్లడేది మాకే అర్ధం కావడం లేదు, తెలంగాణ ప్రజలకు ఏం అర్ధంమౌతుందని ఆయన ప్రశ్నించారు.

Siren: ఫిబ్రవరి 23న తెలుగులో జయం రవి ‘సైరన్’

ఇదిలా ఉంటే.. కృష్టా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించబోమంటూ తెలంగాణ అసెంబ్లీలో సోమవారం కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్ఎస్ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్!’ కారణంగా అధికార పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం ఇదని ఆయన అభివర్ణించారు. కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా రేపు (మంగళవారం) నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ‘ఛలో నల్గొండ’ ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తీర్మానాన్ని ప్రవేశపెట్టనుందని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ట్వీట్‌కు మాజీ సీఎం కేసీఆర్ ఫొటోని కేటీఆర్ జోడించారు.

Ambajipeta Marriage Band : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Exit mobile version