NTV Telugu Site icon

IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా కేఎస్‌ భరత్‌!

Ks Bharat Captain

Ks Bharat Captain

KS Bharat named captain for South Africa Tour: దక్షిణాఫ్రికా పర్యటన కోసం గురువారం బీసీసీఐ సెలెక్టర్లు జట్లను ప్రకటించారు. భారత సీనియర్‌ జట్టుతో భారత్-ఏ జట్టు కూడా దక్షిణాఫ్రికాలో పర్యటనలో భాగం కానుంది. ఈ పర్యటనలో భారత్-ఏ జట్టు దక్షిణాఫ్రికా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. మరోవైపు సీనియర్‌ జట్టుతో ఓ ఇన్‌ట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ కూడా ఆడుతుంది. భారత్-ఏ జట్టుకు ఆంధ్ర వికెట్‌కీపర్‌, టీమిండియా ఆటగాడు కేఎస్‌ భరత్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

సెంచూరియన్‌ వేదికగా జరిగే తొలి టెస్ట్‌ (భారత్ vs దక్షిణాఫ్రికా) మ్యాచ్‌కు ముందు భారత్-ఏ మొదటి నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడనుంది. భారత్ vs దక్షిణాఫ్రికా ఆడబోయే రెండో టెస్ట్‌కు ముందు రెండో మ్యాచ్‌ జరుగనుంది. తొలి మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన భారత్-ఏ జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సాయి సుదర్శన్‌లకు చోటు లభించింది. రెండో మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు ఉన్నారు.

Also Read: Shane Dowrich: వెస్టిండీస్ కీపర్‌ అనూహ్య నిర్ణయం.. జట్టులోకి ఎంపిక చేశాక..!

తొలి నాలుగు రోజుల మ్యాచ్‌కు జట్టు:
సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, ప్రదోష్ రంజన్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్‌ భరత్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, పుల్కిత్ నారంగ్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, తుషార్ దేశ్‌పాండే.

రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు జట్టు:
సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎస్‌ భరత్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, నవదీప్ సైనీ.