Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి విడుదల అంశం మరోసారి రచ్చ రచ్చ అవుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ కు నీటిని విడుదల చేయకపోవడంతో ఏపీకి నీటి కష్టాలు ఎదురవుతున్నాయని ఏపీ పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో తెలంగాణ పోలీసులు కూడా పెద్దఎత్తున అక్కడికి రావడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఏపీ పోలీసులు సీసీ కెమెరాలు, డ్యామ్ గేట్లను ధ్వంసం చేశారు.
Read Also:Hyderabad: పాతబస్తీలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు..
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్పై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇరు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది పోలీసులు అక్కడ మోహరించారు. నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు ప్రయత్నించారు. దీన్ని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. నాగార్జున సాగర్లో నీటిని విడుదల చేస్తేనే ఏపీకి నీరు వచ్చే అవకాశం ఉండడంతో.. దాదాపు 700 మంది ఏపీ పోలీసులు ఎలాగైనా నీటిని విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Read Also:Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్!
నాగార్జున సాగర్లో ఏపీ పోలీసుల భారీ బందోబస్తుపై తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. ఇదంతా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర అని అన్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ డ్రామాకు తెరలేపిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మొత్తంగా తెలంగాణ పోలీసుల కంట్రోల్లో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్కి ఏపీ పోలీసులు వెళ్లడం.. సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రోజునే ఇలా చెయ్యడం.. తీవ్ర కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!