రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ లో భాగంగా… ఇవాళ గన్ పార్క్ కు వచ్చారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ఆదర్శం గా ఉంటుందని… కేటీఆర్ ముందుకు వస్తే ఆయన స్థాయి మరింత పెరిగేదని అభిప్రాయ పడ్డారు.
రాజకీయ నాయకుడు స్థాయి గురించి మాట్లాడితే .. కేటీఆర్ పతనం మొదలైనట్లేనన్నారు. ”ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన సవాల్ ను.. నీ స్థాయి..నా స్థాయి అని అనడం అంటేనే కేటీఆర్ పతనం మొదలైనట్లు” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అమెరికా లో ఉండే కొకైన్ అమ్మకాలు తెలంగాణ లో విపరీతంగా పెరిగాయని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసులు ఉన్నాయో.. లేవో ఇస్తామని… ఈ సారి ఎన్నికల్లో డ్రగ్స్ అలవాటు ఉందా.. లేదా అనే ఆప్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అంతేకాదు… బండి సంజయ్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కి వైట్ ఛాలెంజ్ విసిరారు మాజీ ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి.