Komatireddy Venkat Reddy: నేనెప్పుడూ రానని చెప్పలేదే.. ఫోన్ చేస్తేనే వచ్చాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy:సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్కు వచ్చారు. ఇన్ని రోజులు గాంధీభవన్లో అడుగుపెట్టని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏడాదిన్నర తర్వాత ఈరోజు గాంధీభవన్కు వెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. గాంధీభవన్ మెట్లు ఎక్కబోనని తానెప్పుడూ అనలేదని, మీటింగ్కు రావాలని ఠాక్రే ఆహ్వానించారని తెలిపారు. ఎలక్షన్ కమిటీ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చానని పేర్కొన్నారు. తాను ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని వెంకటరెడ్డి తెలిపారు.
Read Also: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్లో విబేధాలు.. అలిగి వెళ్లిపోయిన వీహెచ్
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
కొత్త ఇంఛార్జ్ ఆహ్వానం మేరకు గాంధీ భవన్కు వచ్చానన్నారు. తనకు గాంధీ భవన్తో 30 ఏండ్ల అనుబంధం వుందన్నారు. 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి ఎలా తీసుకు రావాలనే అంశంపై చర్చిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడు రాజగోపాల్రెడ్డి కి మద్దతు ఇవ్వాలంటూ ఓ కాంగ్రెస్ నాయకుడికి వెంకట్రెడ్డి ఫోన్ చేసిన ఆడియో అప్పట్లో బయటికి వచ్చింది. తన సోదరుడి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా సహకరించారని, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదని, హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.
Read Also: BJP Leader Laxman : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 405తో ముందుకు వెళ్లాలి
ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నేనెప్పుడూ గాంధీభవన్కు రానని చెప్పలేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేశారు అందుకే వచ్చాను. జనవరి 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను. అధికారంలోకి ఎలా రావాలి? అనే అంశంపై చర్చిస్తాము. అవసరమైతే తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను అని అన్నారు. అనంతరం.. గాంధీభవనల్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం, ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు. దీంతో, వారి మధ్య చర్చపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?