NTV Telugu Site icon

AP Floods : లంక గ్రామాల్లో వరద బాధితులు ఆందోళన

Ap Floods

Ap Floods

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లో, ఇటీవల వచ్చిన వరదల దెబ్బకు అనేక కుటుంబాలు విలువలాడుతున్నాయి… అధికారుల నిర్లక్ష్యంతో, లంక గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు కనీస నష్టపరిహారం అందనేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి… దీంతో సర్వం కోల్పోయిన వలస కుటుంబాలు, చెట్ల కింద పుట్ల గట్టున తలదాచుకుంటున్నారు… 10 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లా నుండి, వలస వచ్చిన కొన్ని కుటుంబాలు, కొల్లూరు సమీపంలో నివాసం ఉంటున్నాయి, స్థానికంగా ఇటుక బట్టీల్లో, ఇతర వ్యవసాయ భూముల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు….గత నెల లో వీళ్ళపై వరద విరుచుకుపడింది …ఈ నేపథ్యంలో వరద నుండి తప్పించుకునేందుకు ప్రాణాలతో బయటపడ్డారు కానీ, తమకు జీవనాధారమైన ఇళ్లను, వస్తువులను సర్వస్వాన్ని కోల్పోయారు వలస కుటుంబాలు …అయితే అప్పటినుంచి అధికారులు వస్తూపోతూ ఉన్నారు కానీ, తమకు ఎలాంటి సాయం అందించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు… ఒకపక్క ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి వరద బాధితుడికి సాయం అందాలని చెప్తున్నా ,అధికారుల నిర్లక్ష్యంతో తమకు ఎలాంటి సాయం అందడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నాయి వలస కుటుంబాలు…. పిల్లలతో వేప చెట్టు కింద తలదాచుకుంటున్నామని ,వరద పోయి నెల రోజులు అవుతున్న ,తమకు ఎలాంటి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు….

Vande Bharat Train: మరోమారు వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. భయపడిపోయిన ప్రయాణికులు!