Kolkata Rape Case : కోల్కతా హత్యాచారం కేసుపై మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్ల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case : కోల్కతా అత్యాచారం-హత్య కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలో, మహిళలకు భద్రత కలిపించాలని ప్రజలు వీధుల్లో నిరసనలు చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రజలు నిత్యం ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లతో పాటు పలువురు ప్రముఖులు కోల్కతా బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం కోల్కతాలో జరిగిన ఘటనపై వారు మాట్లాడుతూ.. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. పశ్చిమ బెంగాల్ విధాన రూపకర్తలు వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి.
దాదాపు మూడు వందల మంది న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లు, సీనియర్ అధికారులు, మాజీ సైనికాధికారులు సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య పశ్చిమ బెంగాల్లో దిగజారుతున్న సామాజిక-సాంస్కృతిక దృశ్యాలను.. మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలను గుర్తుచేస్తుంది. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి జవాబుదారీతనం లోపిస్తున్నాయని అన్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
Read Also:Allu Arjun: పాత గాయం రేపేలా అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు??
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ చర్యపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. మొదట్లో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందుకు బాధితురాలి తల్లిదండ్రులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వహించారు. ఇరవై నాలుగు గంటల్లోనే నేరస్థలానికి ఇరవై మీటర్ల దూరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనితో పాటు, వీలైనంత త్వరగా ఈ విషయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, తద్వారా ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు.
దాదాపు మూడు వందల మంది మేధావులు సంతకాలు చేసి.. అన్ని కులాలు, మతాల మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వైద్యుల భద్రత కోసం పెట్రోలింగ్, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలి. అలాగే పురుష, మహిళా వైద్యులకు వేర్వేరుగా వాష్రూమ్లు ఉండాలి. ఎమర్జెన్సీ, SOS కోసం డాక్టర్ గదిలోనే ఏర్పాట్లు చేయాలి. సంస్థల పరిపాలనా అధిపతుల ప్రవర్తనపై కూడా సమగ్ర విచారణ జరగాలి. ఇది మాత్రమే కాదు, ఇది పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒంటరి సంఘటన కాదని ప్రముఖ వ్యక్తులు చెప్పారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ అనేక విభాగాల్లో హింస నిరంతరంగా కనిపిస్తుంది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై కూడా వారు పలు ప్రశ్నలు సంధించారు. దీనితో పాటు రాష్ట్ర శాంతిభద్రతల వ్యవస్థపై అనేక ప్రశ్నలు సంధించారు.
Read Also:PM Modi : పోలాండ్ లోని జామ్ సాహెబ్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన మోడీ
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!