Kolkata Rape Case : కోల్కతా హత్యాచారం కేసుపై మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్ల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case : కోల్కతా అత్యాచారం-హత్య కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలో, మహిళలకు భద్రత కలిపించాలని ప్రజలు వీధుల్లో నిరసనలు చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రజలు నిత్యం ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లతో పాటు పలువురు ప్రముఖులు కోల్కతా బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం కోల్కతాలో జరిగిన ఘటనపై వారు మాట్లాడుతూ.. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. పశ్చిమ బెంగాల్ విధాన రూపకర్తలు వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి.
దాదాపు మూడు వందల మంది న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లు, సీనియర్ అధికారులు, మాజీ సైనికాధికారులు సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య పశ్చిమ బెంగాల్లో దిగజారుతున్న సామాజిక-సాంస్కృతిక దృశ్యాలను.. మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలను గుర్తుచేస్తుంది. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి జవాబుదారీతనం లోపిస్తున్నాయని అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also:Allu Arjun: పాత గాయం రేపేలా అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు??
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ చర్యపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. మొదట్లో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందుకు బాధితురాలి తల్లిదండ్రులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వహించారు. ఇరవై నాలుగు గంటల్లోనే నేరస్థలానికి ఇరవై మీటర్ల దూరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనితో పాటు, వీలైనంత త్వరగా ఈ విషయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, తద్వారా ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు.
దాదాపు మూడు వందల మంది మేధావులు సంతకాలు చేసి.. అన్ని కులాలు, మతాల మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వైద్యుల భద్రత కోసం పెట్రోలింగ్, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలి. అలాగే పురుష, మహిళా వైద్యులకు వేర్వేరుగా వాష్రూమ్లు ఉండాలి. ఎమర్జెన్సీ, SOS కోసం డాక్టర్ గదిలోనే ఏర్పాట్లు చేయాలి. సంస్థల పరిపాలనా అధిపతుల ప్రవర్తనపై కూడా సమగ్ర విచారణ జరగాలి. ఇది మాత్రమే కాదు, ఇది పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒంటరి సంఘటన కాదని ప్రముఖ వ్యక్తులు చెప్పారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ అనేక విభాగాల్లో హింస నిరంతరంగా కనిపిస్తుంది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై కూడా వారు పలు ప్రశ్నలు సంధించారు. దీనితో పాటు రాష్ట్ర శాంతిభద్రతల వ్యవస్థపై అనేక ప్రశ్నలు సంధించారు.
Read Also:PM Modi : పోలాండ్ లోని జామ్ సాహెబ్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన మోడీ
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!