Kolkata Rape Case : కోల్కతా హత్యాచారం కేసుపై మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్ల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case : కోల్కతా అత్యాచారం-హత్య కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలో, మహిళలకు భద్రత కలిపించాలని ప్రజలు వీధుల్లో నిరసనలు చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రజలు నిత్యం ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లతో పాటు పలువురు ప్రముఖులు కోల్కతా బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం కోల్కతాలో జరిగిన ఘటనపై వారు మాట్లాడుతూ.. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. పశ్చిమ బెంగాల్ విధాన రూపకర్తలు వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి.
దాదాపు మూడు వందల మంది న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లు, సీనియర్ అధికారులు, మాజీ సైనికాధికారులు సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య పశ్చిమ బెంగాల్లో దిగజారుతున్న సామాజిక-సాంస్కృతిక దృశ్యాలను.. మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలను గుర్తుచేస్తుంది. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి జవాబుదారీతనం లోపిస్తున్నాయని అన్నారు.
Also Read
- Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
- Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- IND vs AFG T20: వైభవ్తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
Read Also:Allu Arjun: పాత గాయం రేపేలా అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు??
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ చర్యపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. మొదట్లో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందుకు బాధితురాలి తల్లిదండ్రులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వహించారు. ఇరవై నాలుగు గంటల్లోనే నేరస్థలానికి ఇరవై మీటర్ల దూరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనితో పాటు, వీలైనంత త్వరగా ఈ విషయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, తద్వారా ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు.
దాదాపు మూడు వందల మంది మేధావులు సంతకాలు చేసి.. అన్ని కులాలు, మతాల మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వైద్యుల భద్రత కోసం పెట్రోలింగ్, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలి. అలాగే పురుష, మహిళా వైద్యులకు వేర్వేరుగా వాష్రూమ్లు ఉండాలి. ఎమర్జెన్సీ, SOS కోసం డాక్టర్ గదిలోనే ఏర్పాట్లు చేయాలి. సంస్థల పరిపాలనా అధిపతుల ప్రవర్తనపై కూడా సమగ్ర విచారణ జరగాలి. ఇది మాత్రమే కాదు, ఇది పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒంటరి సంఘటన కాదని ప్రముఖ వ్యక్తులు చెప్పారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ అనేక విభాగాల్లో హింస నిరంతరంగా కనిపిస్తుంది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై కూడా వారు పలు ప్రశ్నలు సంధించారు. దీనితో పాటు రాష్ట్ర శాంతిభద్రతల వ్యవస్థపై అనేక ప్రశ్నలు సంధించారు.
Read Also:PM Modi : పోలాండ్ లోని జామ్ సాహెబ్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన మోడీ
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!