Maharastra : చనిపోయాడని తీసుకెళ్తుండగా… గుంతలో పడ్డ అంబులెన్స్.. లేచి కూర్చున్న వృద్ధుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుండి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పాండురంగ్ తాత్యా ఉల్పే అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. వృద్ధుడి మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దారిలో అంబులెన్స్ పెద్ద గుంత గుండా వెళ్లింది. దీంతో అంబులెన్స్లో కూర్చున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చనిపోయినట్లు ప్రకటించిన పాండురంగ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. వెంటనే పాండురంగ్ను మళ్లీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత అందరూ షాక్కు గురయ్యారు. ఇంత అద్భుతం ఎలా జరిగిందో అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సమాచారం ప్రకారం, విషయం కస్బా బావ్డా ప్రాంతానికి చెందినది. డిసెంబరు 16న 65 ఏళ్ల పాండురంగ్ ఉల్పేకు సాయంత్రం అకస్మాత్తుగా తల తిరుగుతుందని ఇంట్లోన కుప్ప కూలిపోయాడు.
Also Read
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన తనను గంగావేష్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పాండురంగ్ మృతి చెందినట్లు ప్రకటించారు. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు పాండురంగ్ ఉల్పే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్ కస్బా బావ్డా ప్రాంతంలో స్పీడ్ బేకర్ను ఢీకొట్టింది. షాక్ కారణంగా పాండురంగ్ తాత్యా వేళ్లు కదలడం ప్రారంభించాయి. శరీరంలో కూడా కదలిక వచ్చింది. అతడిని మళ్లీ ఆస్పత్రికి తరలించగా, ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
Read Also:Girls Missing: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం..
పాండురంగ్ బంధువు మాట్లాడుతూ.. ‘‘మేము కూడా అంత్యక్రియలకు సన్నాహాలు చేసాం. పాండురంగ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో, మేము 3 గంటల పాటు ఆసుపత్రి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాం. ఆ తర్వాత అంబులెన్స్ బుక్ చేసుకున్నారు. మృతదేహాన్ని అందులో ఉంచి ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్లో మనవడు రోహిత్, ఇతర బంధువులు కూడా ఉన్నారు. అప్పుడు అంబులెన్స్ దారిలో ఉన్న గొయ్యి గుండా వెళ్ళింది, దీని కారణంగా అందరూ తీవ్ర షాక్కు గురయ్యారు. పాండురంగ్ వేళ్లు, శరీరం కదులుతున్నట్లు చూశాం. అతని శ్వాసను తనిఖీ చేయగా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు బతికే ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసి అందరం చాలా సంతోషించాం. ఆశ్చర్యపోయాము.’’ అన్నారు.
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!