Maharastra : చనిపోయాడని తీసుకెళ్తుండగా… గుంతలో పడ్డ అంబులెన్స్.. లేచి కూర్చున్న వృద్ధుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుండి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పాండురంగ్ తాత్యా ఉల్పే అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. వృద్ధుడి మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దారిలో అంబులెన్స్ పెద్ద గుంత గుండా వెళ్లింది. దీంతో అంబులెన్స్లో కూర్చున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చనిపోయినట్లు ప్రకటించిన పాండురంగ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. వెంటనే పాండురంగ్ను మళ్లీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత అందరూ షాక్కు గురయ్యారు. ఇంత అద్భుతం ఎలా జరిగిందో అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సమాచారం ప్రకారం, విషయం కస్బా బావ్డా ప్రాంతానికి చెందినది. డిసెంబరు 16న 65 ఏళ్ల పాండురంగ్ ఉల్పేకు సాయంత్రం అకస్మాత్తుగా తల తిరుగుతుందని ఇంట్లోన కుప్ప కూలిపోయాడు.
Also Read
- Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన తనను గంగావేష్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పాండురంగ్ మృతి చెందినట్లు ప్రకటించారు. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు పాండురంగ్ ఉల్పే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్ కస్బా బావ్డా ప్రాంతంలో స్పీడ్ బేకర్ను ఢీకొట్టింది. షాక్ కారణంగా పాండురంగ్ తాత్యా వేళ్లు కదలడం ప్రారంభించాయి. శరీరంలో కూడా కదలిక వచ్చింది. అతడిని మళ్లీ ఆస్పత్రికి తరలించగా, ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
Read Also:Girls Missing: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం..
పాండురంగ్ బంధువు మాట్లాడుతూ.. ‘‘మేము కూడా అంత్యక్రియలకు సన్నాహాలు చేసాం. పాండురంగ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో, మేము 3 గంటల పాటు ఆసుపత్రి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాం. ఆ తర్వాత అంబులెన్స్ బుక్ చేసుకున్నారు. మృతదేహాన్ని అందులో ఉంచి ఇంటికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అంబులెన్స్లో మనవడు రోహిత్, ఇతర బంధువులు కూడా ఉన్నారు. అప్పుడు అంబులెన్స్ దారిలో ఉన్న గొయ్యి గుండా వెళ్ళింది, దీని కారణంగా అందరూ తీవ్ర షాక్కు గురయ్యారు. పాండురంగ్ వేళ్లు, శరీరం కదులుతున్నట్లు చూశాం. అతని శ్వాసను తనిఖీ చేయగా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు బతికే ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసి అందరం చాలా సంతోషించాం. ఆశ్చర్యపోయాము.’’ అన్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!